Guntur Kaaram : ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, గురూజీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మూవీ గుంటూరు కారం. ఎంతెంతగా అభిమానులు ఎదురు చూస్తున్నారో అంతగా ఆలస్యమవుతూ వస్తుంది దీనికి తోడు సోషల్ నెగిటివ్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఒకసారి మూవీ ఆగిపోయింది అని న్యూస్ ట్రెండ్ అవుతే.. ఇప్పుడు హీరోయిన్ పూజ హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను మూవీ తప్పిస్తూ చిన్నచిన్న మార్పులు చేస్తున్నారు మేకర్స్ అనే వార్తను ప్రచారం చేస్తున్నారు.
నిజానికి త్రివిక్రమ్ కు పూజతో, థమన్ తో ఇదే ఫస్ట్ మూవీ కాదు. వీరిద్దరితో త్రివిక్రమ్ కు, ప్రొడ్యూసర్ కి మంచి సంబంధాలున్నాయి. కానీ నిన్నటి నుంచి తమన్ ను తప్పించారనే వార్త వైరల్ అవ్వడంతో థమన్ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో బనాన పిక్ పెట్టి.. కడుపు మంటకు అరటిపండు మంచిది అంటూ రాసుకొచ్చాడు. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాక షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన గుంటూరు కారం ఎట్టకేలకు కొత్త షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు.
జులై 6 నుంచి 14 వరకు హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ షెడ్యూల్ అయినా అనుకున్నట్టు జరుగుతుందో లేదో చూడాలి. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీలో జగపతిబాబు విలన్ కాగా యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చితాన్ని విడుదల చేయనున్నారు.
https://twitter.com/MusicThaman/status/1670842762764365824?t=EIwp1oEKI-UJ1NyglrT2xQ&s=19
Discussion about this post