Jr NTR : న్యూయార్క్ లోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 12న జరిగిన ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో RRR మూవీ నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు.
ఆస్కార్ అవార్డ్ వేడుకలలో జక్కన్న దంపతులతో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆస్కార్ వేడుకలు ముగియడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్టీఆర్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.
జై ఎన్టీఆర్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఆస్కార్ వేదికపై పెర్ఫార్మెన్స్ను జీవితంలో మరిచిపోలేనన్నారు. ఆస్కార్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో NTR 30లో నటిస్తున్న విషయంలో తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Discussion about this post