Jr NTR: కొరటాల శివ టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. కమర్షియల్ సినిమాల్లో కూడా సామాజిక స్పృహను టచ్ చేయడం కొరటాల ప్రత్యేకత. మిర్చి మూవీతో డైరెక్టర్ గా మారిన కొరటాల వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. అయితే ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
తొలిసారి కెరీర్ లో అపజయం మూట కట్టుకున్నాడు కొరటాల శివ. అయినప్పటికీ ఆచార్య తర్వాత వెంటనే కొరటాల జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే పనిలో బిజీ అయ్యాడు. ఎన్టీఆర్ 30 టైటిల్ తో త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. RRR తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.
ఈ కారణంగానే మూవీ ఆలస్యం అయ్యిందని టాక్. మొత్తానికి ఈ మూవీ ఈ నెల 24 నుంచి సెట్ మీదకు వెళ్లబోతుండగా.. పూజ కు డేట్ ఫిక్స్ చేసేసారు. అలాగే వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. లీక్ స్టోరీ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అంటూ తెలుస్తోంది.
సముద్రం, పోర్ట్, స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ అని యూనిట్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్లు, వీడియోల వల్లే తెలుస్తోంది. వైరల్ అవుతున్న కథలో కూడా అదే వుంది. ఇందులో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ డబుల్ రోల్, అలాగే రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుందంట.. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Discussion about this post