Mahesh Babu: డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ అడ్వెంచర్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా మరో సినిమా చేయనున్నాడు. SSMB28గా వస్తున్న చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాపై ఇదివరకే భారీ అంచనాలు నెలకొన్నాయి. సర్కారు వారి పాట విజయం తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్.. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా(SSMB28 OTT Rights) ఓటీటీ హక్కులను రూ. 80 కోట్లకు సొంతం చేసుకుందంటున్నారు. మహేష్ బాబుతో పాటు.. దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రానికి భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రాలేదు.