సూపర్స్టార్ మహేశ్బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రెస్టారెంట్ బిజినెస్లోకీ అడుగుపెట్టారు. ఏషియన్ గ్రూప్స్తో హైదరాబాద్లో రెస్టారెంట్ ప్రారంభించారు నమత్ర. మినర్వ గ్రూప్తో కలిసి మినర్వా -ఏఎన్ (AN – ఏషియన్ నమ్రతా) పేరుతో బంజారాహిల్స్లో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇక మహేష్ రెస్టారెంట్ కదా అభిమానులందరూ ఆ రెస్టారెంట్ కు వెళదామని రెడీ అయి మెనూ చూసి అవాక్కయ్యారు. ఎందుకు.. ఐటమ్స్ అన్ని లేవా అనుకుంటున్నారా.. ఐటమ్స్ ఉన్నాయి.. కానీ వాటి రేటే పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు ఏ మాత్రం ఆ రెస్టారెంట్ లో అడుగుపెట్టేలా లేవు.
రెండు ఇడ్లీ రూ. 90 లతో మొదలై సాయంత్రం తినే మిరపకాయ బజ్జీలు ప్లేట్ వచ్చి రూ.125.. ఇక ఒక కప్ టీ వచ్చి రూ. 80 లు అంట.. ఇక ఈ మెనూ చూసిన నెటిజన్లు ఈ డబ్బుతో వారం రోజులు తినొచ్చు.. బ్యాచిలర్స్ అయితే రెండువారాలు టీ తాగొచ్చు. మరీ ఇంత కాస్ట్ ఏంటి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇది కేవలం డబ్బున్నవారి కోసం మాత్రమే అని, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళేది కాదని పెడవివిరుస్తున్నారు.