Pooja Hegde : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఆది నుంచి ఈ మూవీకి అన్నీ ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయితే ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు కానీ షూటింగ్ మాత్రం జరగట్లేదు. ఆర్టిస్టుల డేట్స్ సర్దుబాటు కాక వాయిదాల మీద వాయిదాలు పడుతుంది గుంటూరు కారం. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
గుంటూరు కారం నుంచి పూజ హెగ్డే తప్పుకుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్దేను అనుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు. అయితే పూజ హెగ్డే ఇచ్చిన డేట్స్ వాడుకోకపోవడం వలన, ఇక ఇప్పుడు ఆమె డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదట. దీంతో శ్రీలలను మెయిన్ హీరోయిన్ గా సెట్ చేసి.. సెకండ్ హీరోయిన్ గా సాక్షి వైద్యను లేదా సంయుక్త మీనన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట.
అయితే గుంటూరు కారం మూవీ కోసం పూజకి అడ్వాన్స్ గా 70 లక్షల వరకూ ఇచ్చారట. ఆ మొత్తం క్రింద ఒక స్పెషల్ సాంగ్ చేయమని మేకర్స్ అడుగుతున్నారట. ఎలాగూ పూజకి ఇటు త్రివిక్రమ్ తోనూ.. అటు మహేశ్ తోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో నో చెప్పే ఛాన్స్ లేదట. ఈ మూవీకి హీరోయిన్ ఎవరో తెలియాలి అంటే మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే. హారిక హాసిని క్రియేషన్స్ లో నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Discussion about this post