Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కెరీర్ లో ఫస్ట్ టైం 100కోట్ల క్లబ్ లో చేరాడు ఈ మెగా హీరో. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని వరుస సినిమాలు చేస్తున్నాడు. దీంతో మరోసారి అందరి కళ్ళు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై పడ్డాయి. ఆయన పెళ్ళెప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తన మామయ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి
సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ‘బ్రో’ మూవీలో నతించాడు. అయితే ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతిలోని ఓ థియేటర్ నిర్వహించారు. అక్కడ సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా.. ‘ఇంకెక్కడ పెళ్లి బ్రో. ఈ మూవీకి ముందు కొంత మందైనా ట్రై చేసేవారు. ఈ సినిమా చేశాక, అమ్మాయిలందరూ నన్ను బ్రో.. బ్రో అని పిలుస్తారేమో.. ఇక నాకు పెళ్ళెక్కడ అవుతుంది. ఇదంతా పవన్ మావయ్యే చేశాడు అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు మెగా హీరో.
Guntur Kaaram : ‘గుంటూరు కారం’కు మళ్లీ బ్రేక్..
దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. బ్రో మూవీ ఈ నెల 28న విడుదల కానుండగా.. నెక్స్ట్ సంపత్ నంది డైరెక్షన్ లో ఒక మాస్ మసాలా లాంటి సినిమా చేయనున్నాడు తేజు. సిటీ మార్ సినిమా తర్వాత సంపత్ నంది మరో సూపర్ హిట్ కథ సిద్ధం చేసే పనిలో దాదాపుగా రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలో సాయి ధరంతేజ్ తో ఒక అదిరిపోయే యాక్షన్స్ సినిమాను ప్లాన్ చేశాడు. త్వరలో ఈ మూవీ ప్రకటన వెలువడనుంది.
Pooja Hegde : సూసైడ్ అటెంప్ట్ చేసిన పూజ హెగ్డే..!