Vinaro Bhagyamu Vishnu Katha OTT Release Date : రాజాగారు రాణివారుతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’తో హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ మధ్యే ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీలో కిరణ్ కు జోడిగా కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నెంబర్ నైబర్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈమూవీ ఈనెల 18న విడుదలై పాసిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా
ఈ చిత్రాన్ని మార్చి 22న ఉగాది సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. “చూడరో భాగ్యము ఈ చిత్ర కథ ఉగాదికి వస్తోంది ఆహాలో అలా ఒక్కొక్క టేస్ట్ కి ఒక్కొక్క ట్విస్ట్ అట.. ఇక లేటేందుకు పద..” అనే ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో ఆహా పోస్ట్ చేసింది. దీంతో థియేటర్ లో మిస్ అయినా వారు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Discussion about this post