Taraka Ratna Passed Away : తారకరత్న కన్నుమూత…!!
సినీ నటుడు.. ఎన్టీయార్ మనవడు నందమూరి తారకరత్న గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత నెల 26 న టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి మోహన కృష్ణ తనయుడు సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం..కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అప్పటినుండి ఆయన కోలుకుంటారు అని అంతా ఎదురుచూశారు.. బాబాయ్ బాలయ్య కూడా నిరంతరం అక్కడే ఉండి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రయత్నిస్తు వచ్చాడు..
పైగా విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. విదేశీ వైద్యులు దాదాపు 23 రోజులుగా .. అంత్యంత మెరుగైన వైద్యం అందిస్తూ కూడా ఆయన ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు.
చివరికి ఈ రోజు (శనివారం 18న )తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇటు తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులతో పాటు.. సినిమా అభిమానుల్లో కూడా విషాదాన్ని నింపింది. నందమూరి ఫ్యామిలీకి పలువురు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు.