Bobbili Veena : దర్శన స్పర్శనే చాస్య భోగ స్వర్గాపవర్గదే పునీతో విప్రహత్యాది పాతకైః పతితం జనమ్ దండ శంభురుమా తంత్రీ కకుభః కమలాపతిః ఇంద్ర పత్రికా బ్రహ్మ తుంబం నాభిః సరస్వతీ దొరకో వాసుకిర్జీవ సుధాంశుః సరికా రవిః సర్వదేవమయీ తస్మాద్ వీణేయం సర్వమంగలా
వీణను చూడటం మరియు తాకడం ద్వారా, ఒక వ్యక్తి పవిత్రమైన మతాన్ని మరియు ముక్తిని పొందుతాడు. ఇది బ్రాహ్మణుడిని చంపినందుకు దోషిగా ఉన్న పాపిని శుద్ధి చేస్తుంది. చెక్కతో లేదా వెదురుతో చేసిన దండ శివ, తీగ దేవి ఉమ, భుజం విష్ణువు, వారధి లక్ష్మి, గోరింటాకు బ్రహ్మ, నాభి సరస్వతి, అనుసంధాన తీగలు వాసుకి, జీవుడు చంద్రుడు మరియు సూర్యుడు. దాదాపు అన్ని దేవతలు సూచిస్తుంది,కాబట్టి, అన్ని రకాల దైవిక ఆశీర్వాదాలు, దీవెనలు మరియు శుభాలను అందించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆన్నది భావం.
తీగలు మీటితే సప్తస్వర నాదంలా ప్రతిస్పందిస్తూ సంగీత వీధులో ప్రతిధ్వనిస్తూ వినుల విందైన తరంగాలను అందిస్తూ ఆంతరంగాలను ఆనందపరిచే తంత్రీ వాయిద్యం వీణ .వీణానాదం తో అందరి మనస్సులను అలరిస్తాయి. అంతటి వీణల తయారీకి ప్రసిద్ధి గాంచింది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గొల్లపల్లి ఇక్కడ సంగీత అభిమానులను అలరించే సరస్వతీ వీణల నుండి చిన్నచిన్న బహుమతుల వీణల తయారీ వరకు ఓ ప్రత్యేకత కలిగింది. వీణల సంగీతం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కూడా ఆ చిన్నచిన్న వీణల జ్ఞాపికలే నేడు ప్రపంచ నలుమూలలకు సరఫరా అవుతున్నాయి.
అంతేకాదు బొబ్బిలి చరిత్రను ఖండాంతరాల్లో ప్రాచుర్యం పొందేలా చేస్తున్నాయి. తెలుగు వారికి, తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచాయి. సుస్వరాలు పండించే బొబ్బిలి వీణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశ, విదేశాల్లో బొబ్బిలి వీణ రాగాలు విన్పిస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖుల కితాబులు పొందిన బొబ్బిలి వీణ ఎన్నో వేదికల పై అరుదైన గుర్తింపు దక్కింది. ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకమైన జి 20 సభ్యదేశాల సమావేశాల్లో సైతం బొబ్బిలి వీణ తన వైభవాన్ని చాటుకోనుంది.
జియోగ్రాఫికల్ గుర్తింపు లభించిన బొబ్బిలి వీణలకున్న పేరు, ప్రఖ్యాతి మరే వీణలకు లేదనే చెప్పాలి. సుమారు మూడు వందల ఏళ్ల క్రితం బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరును సందర్శించిన సమయంలో అక్కడ రాజ దర్బారులో వీణా కచేరీని తిలకించారు. కళలలకు ప్రాణం పెట్టే బొబ్బిలి రాజులకు కచేరీలోని వీణా మాధుర్యంతో పాటు ఆ వీణలు తయారుచేసిన వడ్రంగుల నైపుణ్యం కూడా ఎంతో ఆకర్షించింది. వెనువెంటనే వాటిని బొబ్బిలిలో తయారు చేయించాలని నిర్ణయానికి వచ్చారు.
వీణల తయారీలో మెలకువలు నేర్చుకోవాలని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించారు. అలా మైసూరులో మెలకువలు నేర్చుకున్న వడ్రంగుల వంశీయులు నేటికీ బొబ్బిలిలో వీణలు తయారుచేస్తున్నారు. వీణలు పనస చెక్కతో తయారు చేయబడ్డాయి. ఇది తేలికైనది మరియు అద్భుతమైన ప్రతిధ్వని, స్పష్టమైన ధాన్యపు గీతలు, గొప్ప మన్నిక మరియు తేమలో కనీస వాపు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కలప అవసరమైన పరిమాణంలో, సుమారు 4-5 అడుగుల పొడవుతో కత్తిరించబడుతుంది.
బొబ్బిలి , నూజివీడు వీణల ప్రత్యేకత ఏమిటంటే అవి ఒకే చెక్క దుంగతో చెక్కబడి ఉంటాయి . అలాంటి వీణలను ఏకంది వీణ అంటారు .బొబ్బిలి లో తయారైన వీణలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మైసూర్, తంజావురు వీణలు మూడు చెక్కలతో తయారు చేస్తే బొబ్బిలి వడ్రంగులు మాత్రం ఒకే ఒక చెక్కతో ఏకండి గా తయారు చేయడంలో సిద్ధహస్తులు. రాష్ట్రపతి భవన్ నుంచి శ్వేత సౌధం వరకు గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకు ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కు నామినేట్ అవ్వడంతో మరో సారి తన ఖ్యాతిని నిలబెట్టుకోగలిగింది.