Haunted Railway Station : ఈ ప్రపంచంలో వింతలకు కోదవలేదు. ఎక్కడోచోట మనము ఏదో ఒక వింత గురించి వింటూనే ఉంటాము. దాంట్లో ఒక భాగమే ఈ రైల్వేస్టేషన్లు. వీటి గురించి వింటే మనం భయ కంపితులము కావాల్సిందే. ఒక్కో రైల్వే స్టేషన్ వింత శబ్దాలతో, విచిత్రమైన ఆకారాలతో అటువైపు మానవమాత్రుడు అడుగు పెట్టాలంటే ఒళ్ళు జలజరించేలా చేస్తాయి. అవి ఎక్కడున్నాయో.. వాటి వెనక చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబయి డోంబివిలి రైల్వే స్టేషన్ : ఒక రోజు ఒక వ్యక్తి తను వెళ్లాల్సిన రైలు కోసం ఆ స్టేషన్లో నిలబడి ఎదురుచూస్తున్న సమయంలో అతనికి ఒక స్త్రీ గొంతు ఏడుపుతో వినిపించింది. అతను దగ్గరికి వెళ్లి ఆమెను ఏం జరిగిందని అడగగా, తను వెళ్లవలసిన రైలు మిస్ అయిపోయిందని ఆమె చెప్పింది. మరుసటి రోజు అదే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మళ్ళీ అదే రైల్వేస్టేషన్లో రైలు
కోసం చూస్తున్నప్పుడు అతడికి మళ్ళీ ఆ స్త్రీ గొంతు ఏడుపుతో వినిపించింది. ఇప్పుడు స్నేహితులిద్దరూ కలిసి ఆ స్త్రీ దగ్గరికి వెళ్లి మాట్లాడగా అతని స్నేహితుడికి అక్కడ ఎటువంటి స్త్రీ కనిపించలేదు. దాంతో ఆమె దయ్యామని తేలిపోయింది. ఆ స్టేషన్లో వింత శబ్దాలు కూడా వినిపించేవని స్థానికులు చెప్పడంతో ఆ స్టేషన్ ని మూసివేశారు.
కోల్కతా రవీంద్ర సరోవర్ మెట్రో స్టేషన్ : కోల్ కతాలోని ఈ స్టేషన్ నీ ఆత్మహత్యల స్టేషన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే చనిపోయిన వారందరూ కూడా ఆత్మలుగా మారీ అక్కడ తిరుగుతాయని స్థానికులు నమ్ముతారు. దానికికారణం రాత్రి కాగానే అక్కడ వింత అరుపులు, ఏడుపులు వినిపిస్తూ ఉంటాయంట.. ఆ సమయంలో ఆ స్టేషన్ వైపు ఎవరూ వెళ్లారు. ఆ స్టేషన్ మొత్తం నిర్మానుషంగా మారిపోయింది.
పశ్చిమ బెంగాల్లోని బెగుంకోదర్ రైల్వే స్టేషన్ : ఈ రైల్వే స్టేషన్ 42 సంవత్సరాల నుండి మూతపడే ఉంది. దాని కారణం ఒక స్త్రీ తెల్లచీర కట్టుకొని రాత్రి వేళల్లో రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండడం చాలామంది చూసామని చెప్పారు. ఆమె ఒకరోజు ఆ స్టేషన్ లోనే రైలు కిందపడి మరణించింది. అప్పటినుంచి ఆ స్టేషన్ లోనే తిరుగుతుందని స్థానికులు చెప్పడంతో ఆ స్టేషన్ ని గోస్ట్ స్టేషన్ గా పిలుస్తారు. ఆ స్టేషన్ ని అప్పుడు మూసివేశారు. ప్రస్తుతం తిరిగి ప్రారంభించారు.
హిమాచల్ ప్రదేశ్ బరోగ్ రైల్వే స్టేషన్ : ఈ స్టేషన్ కు చేరుకోవడానికి ఒక పర్వతాన్ని తోలచి మరి ఒక సోరంగాన్ని తయారుచేశారు. ఈ పనిని బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ బరోగ్ చేశారు. అయితే ఆ నిర్మాణ సమయంలో ఆ ఇంజనీర్ ఆ సొరంగంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని స్థానికులు చెబుతారు. అప్పటినుంచి ఆ సొరంగం నుండి వింత అరుపులు, ఏవో శబ్దాలు వినిపించడంతో ఆ స్టేషన్ ని మూసివేశారు.