Kapurthala : భారతదేశం వైవిధ్యాల భరితమైనది. ఎన్నో సంస్కృతులు, చారిత్రక అంశాలు, ఆచార సంప్రదాయాలతో భారతదేశం ఎప్పుడు వినుత్నంగానే ఉంటుంది. అటువంటి భారతదేశంలో అతి చిన్న నగరంగా పేరుగాంచిన ఒక నగరం ఉంది. భారతదేశంలో కొన్ని నగరాలు కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పేరుగాంచాయి. వాటిల్లో ముఖ్యంగా ముంబై ఆర్థిక రాజధానిగా, కలల నగరంగా అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అలాగే ఢిల్లీని హృదయాల రాజధానిగా పిలుస్తారు.
అయితే భారతదేశంలో అతి చిన్న నగరంగా పేరుగాంచిన ఆ నగరంలో 2011 సంవత్సరం నాటికి అక్కడి జనాభా 98,916 మంది ప్రజలు ఉండగా..10 సంవత్సరాలు తర్వాత ఇక్కడ జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ రావడంతో ఇక్కడ జనాభా గణన జరగలేదు. దీనివల్ల 2011 సంవత్సరం యొక్క గణాంకాలు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ నగరం పంజాబ్ లోని కపూర్తలా. దీనిని పారిస్ ఆఫ్ పంజాబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నగరాన్ని స్థాపించిన నవాబు పేరు మీదుగా ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.
చాలా నగరాల గురించి మనం వినే ఉంటాం. కానీ భారతదేశంలోనే అతి చిన్న నగరంగా కపూర్తలా పేరుగాంచింది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. అందమైన భవనాలు,రహదారులతో ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు కపూర్తాలలో ఎంతో పరిశుభ్రత కనిపించేది. అంతేకాదు ఈ నగరం భారతీయ రైల్వేలకు కూడా ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఇంట్రిగల్ కోచ్ ఫ్యాక్టరీ {ICF} ఈ నగరంలోనూ ఉండడం విశేషం. భారతీయ రైల్వేసంస్థ , రైలు కోచ్ లను ఇక్కడి నుండే సరఫరా చేస్తుంది.
జగత్జిత్ ప్యాలెస్ : జగత్ జిత్ ప్యాలెస్ 1908లో నిర్మించబడింది. జగత్ జిత్ ప్యాలెస్ ఒకప్పుడు కపూర్తలా రాష్ట్రానికి చెందిన మహారాజు అయినటువంటి జగత్ జిత్ సింగ్ నివాసంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి దానిని ఇండో-సార్సెనిక్ ఆర్కిటెక్చర్ భవనంగా అక్కడి నుండి సైనిక్ స్కూల్ నడుపుతూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోసం అబ్బాయిలకు శిక్షణను ఇస్తున్నారు. అందుకే ఈ ప్రదేశం పర్యటకులను చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది.
షాలిమార్ గార్డెన్ : ఇక్కడి షాలిమార్ గార్డెన్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. కుటుంబ పర్యటనకు ఇది చాలా మంచి ప్రదేశం. ఇక్కడి పార్కులో కపూర్తలా రాజకుటుంబానికి చెందిన సమాధులు ఉంటాయి. అలాగే ఎర్ర ఇసుకరాయి తో చేసిన గదులలో పాలరాతి స్మారక చిహ్నాలు కూడా ఉంటాయి.
ఎలిసీ ప్యాలెస్ : ఈ ప్యాలెస్ ను 1962లో కన్వర్ బిక్రమ్ సింగ్ ఇండో ఫ్రెంచ్ నిర్మాణ శైలిలో నిర్మించారు. కన్వర్ బిక్రమ్ సింగ్ 1835 నుండి 1887 వరకు కపూర్తలా రాచరిక రాష్ట్రాన్ని పాలించిన అత్యంత ప్రతిభావంతమైన సిక్కు నాయకులలో ఒకరు. అయితే కాలక్రమేనా ప్యాలెస్ MGN స్కూల్ గా మార్చబడింది. ఇప్పుడు అది కపూర్తలాలో సందర్శించదగిన స్మారక చిహ్నంగా పేరుపొందింది.