Peasant Island : ఒక ద్వీపాన్ని రెండు దేశాలు పరిపాలించడం ఎప్పుడైనా చూశారా.. కానీ ఈ ద్వీపాన్ని ఆరు నెలలు ఒక దేశం, మిగతా ఆరు నెలలు ఒక దేశం పరిపాలిస్తుంది. ఈ వింతైన ద్వీపం పేరు పీజంట్. దీనిని ఫాసెన్స్ ద్వీపం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వింత ద్వీపం ఫ్రాన్స్, స్పెయిన్ మధ్యలో ఉంటుంది. ఈ ద్వీపాన్ని ఈ రెండు దేశాలు చెరొక ఆరు నెలలు పరిపాలిస్తూ ఉంటాయి.
ఈ ద్వీపానికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి గొడవలు లేకపోవడం ఇక్కడ గమనార్హం. గొడవలకు బదులుగా ప్రతి ఒకరు ఆరు నెలల చొప్పున ఈ ద్వీపాన్ని పరిపాలించడానికి నిర్ణయించుకున్నారు. అసలు ఈ ద్వీపాన్ని రెండు దేశాలు ఇలా పరిపాలించడానికి గల కారణం ఏమిటి? దీని వెనకాల ఏదైనా చరిత్ర దాగి ఉందా..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
350 సంవత్సరాల క్రితం నాటిది ఈ ద్వీపం. 1659 సంవత్సరంలోనే ఈ ద్వీపం అధికార మార్పిడికి సంబంధించి స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఈ ద్వీపాన్ని ఇలా పరిపాలించడానికి ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడంలో చాలా గొడవలు జరిగాయి అని చరిత్ర చెబుతుంది. దీనిని పేట్స్ ఒప్పందం అని కూడా పిలుస్తూ ఉంటారు.
చాలా గొడవల అనంతరం ఈ ద్వీపాన్ని చరో ఆరు నెలలు పరిపాలించడానికి శాంతి ఒప్పందాలు జరిగాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ ద్వీపం యొక్క పొడవు 200 మీటర్లు కాగా.. వెడల్పు 40 మీటర్లుగా చెప్తున్నారు. ఈ ద్వీపాన్ని ఆగస్టు 1 జనవరి 31 వరకు ఫ్రెంచ్ ఆధీనంలో ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుండి జూలై 31 వరకు స్పెయిన్ ఆధీనంలో ఉండేలాగా శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు.