Sawarna Rekha River : ఈ ప్రకృతిలో చాలా వింతలు, విశేషాలు మనం చూస్తూనే ఉంటాం. దాంట్లో ఒకటే బంగారాన్ని తనలో దాచుకున్న నది. నదిలో బంగారం దొరకడం ఏంటి అని అనుకుంటున్నారా..! కానీ ఇది నిజం. ఆ నది పేరు స్వర్ణరేఖ నది. ఆ నదిలో ప్రజలు బంగారాన్ని చేపలు పట్టినట్టుగా పడతారు. అక్కడి ప్రజలు ఆ నదిని సువర్ణరేఖ అని పిలుచుకుంటారు.ఈ యొక్క నది జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది.
జార్ఖండ్ లోని పిస్కా అనే గ్రామంలో ఈ నది పుట్టినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుండి ప్రవహిస్తూ ఎంతోమందికి జీవనోపాధిని ఈ నది కల్పిస్తుంది. నది నుండి బంగారాన్ని ఎలా తీస్తారు అనేది తెలుసుకుందాం.. ఆ నదులకు సమీపంలో జీవిస్తున్న కొన్ని కుటుంబాలు సూర్యోదయం అవ్వడంతోనే జల్లెడ పట్టుకొని నది ఒడ్డుకు వెళ్తారు. ముందుగా నదిలోని ఇసుకను, ఒడ్డు మీద ఇసుకను సేకరిస్తారు. దానిని జల్లెడ పడతారు. జల్లెడ పట్టగా, పట్టగా కొంత రజనులాంటిది మిగులుతుంది.
దాంట్లో వచ్చే రాళ్లు మిగతా మిశ్రమాన్ని పక్కకు తీసేస్తారు. అలా చిన్న, చిన్న అణువుల రూపంలో బంగారం కనబడుతుంది. ఆ బంగారాన్ని అమ్ముకొని చాలా కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అలా అనీ బంగారం వారికి ఎక్కువ మోతాదులో దొరకదు. చాలా తక్కువ బంగారాన్ని వారు సేకరిస్తారు. దాన్ని సాయంత్రం కాగానే రాంచీలోని బంగారం షాపుల్లో అమ్ముతారు. దీనినే వృత్తిగా చేసుకొని చాలా కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి.
ఎన్నో గంటల శ్రమ తర్వాత వీరికి ఒక గ్రాము బంగారం లభిస్తుంది. ఆ ఒక గ్రామ బంగారాన్ని తీసుకువెళ్లి 4 లేక 5 వేలకు దుకాణాల్లో విక్రయిస్తారు. పిస్కా గ్రామాల్లోని కుటుంబాలు గొప్పలకే బంగారాన్ని అమ్ముతున్నాయి. కానీ వారికి దొరికే ఆదాయం చాలా తక్కువ. జార్ఖండ్ మీదుగా ఈ నది ప్రవహించినప్పటికీ అక్కడ బంగారం చాలా తక్కువగా లభిస్తుంది.
పిస్కా గ్రామంలోనే బంగారం ఎక్కువగా దొరుకుతుంది, అందులోనూ బంగారం వేటకు శీతాకాలం అనువైనది. ఆ కాలంలో ఎక్కువ బంగారం వారికి లభిస్తుంది. దీన్నిబట్టి ఆ భూగర్భంలో బంగారు గనులు ఉన్నాయని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి కలుస్తుంది అనే విషయాన్ని వారు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. భూగర్భాన్ని తవ్వే ప్రయత్నాలు కూడా చేయలేదు.