Train : భారతీయ రైల్వేల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యంత వేగంగా నడిచే రైలు సౌకర్యంతో ఎంతో మంది ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మనకు వేగంగా నడిచే రైలు గురించి మాత్రమే తెలుసు. కానీ అన్ని రైలల్లోకల్లా అతి నెమ్మదిగా నడిచే రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైలు ప్యాసింజర్ రైలు. ఇది భారతీయ రైల్వే లోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలుగా పేరుపొందింది. ఇది ప్రయాణికులను చాలా నెమ్మదిగా తీసుకువెళ్తుంది.
ఈ రైలు వెళ్లే మార్గమధ్యంలో దృశ్యాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ రైలు పేరు నీలగిరి మౌంటెన్ రైలు. నీలగిరి మౌంటెన్ నుంచి వెళ్లే రైలు బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు. ఈ నీలగిరి మౌంటెన్ రైలు నెమ్మదిగా వెళ్లడమే కాకుండా చాలా రికార్డులను కూడా కలిగి ఉంది. తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో కల్లార్, కూనూర్ మధ్య 20 కిలోమీటర్ల వంపు ఆసియాలోనే అత్యంత ఎత్తైన రైలు అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది.
ఈ రైలు వెళ్లే మార్గం పర్వత మార్గం. ఈ రైలు 1.12.28 వాలు నుండి ముందుకు వెళ్తున్నా కొద్దీ ఒక పాయింట్ వాలు నుండి రైలు ప్రయాణించే ప్రతి అడుగుకు 12.28 అడుగులకు ఒక అడుగు ఎత్తు పెరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని భారత దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు అని పిలుస్తారు. నీలగిరి మౌంటైన్ రైలు అత్యంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది. తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు ఐదు గంటల వ్యవధిలో కేవలం 46 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది.
ఇది మన దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు కంటే దాదాపు 16 రెట్లు వెనుకబడి ఉంటుంది. ఇండియాలో మెట్టు పాళాయం నుంచి ఊటీ వరకు నడిచే ఏకైక ర్యాక్ రైల్వే ఇది. పర్యటకులు ఎక్కువగా ఈ రైలులో ప్రయనిస్తూ ఉంటారు. సెలవు దినాల్లో పర్యటకులు ఎక్కువగా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రదేశం చూడడానికి ఆకర్షణీయమైనది. ఇక్కడ పచ్చదనం, నీరు, పర్వతాలు, ఇతర ప్రకృతి అందాలను మనం చూడవచ్చు. 1908 నుంచి ఊటీ ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని అనుభవించే ప్రజల కోసం సింగల్ ట్రాఫిక్ లో ఈ రైలు ప్రయాణిస్తుంది.
అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు హిల్ స్టేషన్ కి వెళ్లి వేడి నుంచి ఉపశమనం పొందేవారు. అక్కడే ఆహ్లాదకరమైన వాతావరణన్ని వారు ఆస్వాదించేవారు. ఇప్పుడు అది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరుగాంచింది. ఈ నీలగిరి మౌంటెన్ రైలు మెట్టుపాలయం నుండి ఉదయం 7.10 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు ఊటి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5. 30 నిమిషాలకు మెట్టుపాలయం చేరుకుంటుంది. ఈ మార్గంలో ప్రధాన స్టేషన్లో కునూరు,వెల్లింగ్టన్, అరవంకాడు, కేతి, లవ్డేల్ లు ఉన్నాయి.