Tuvalu : ఒక దేశం రాబోయే 50 సంవత్సరాలలో మాయం కాబోతుంది అంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అలా అదృశ్యం అవ్వడానికి అదేమైన మాయదేశమా అని వింత ఆలోచనలు మీకు కలగవచ్చు. కానీ అక్కడ మాయ లేదు మంత్రం లేదు. రాబోయే 50 సంవత్సరాలలో ఆ దేశం సముద్రంలోకి కృంగిపోనుంది. ఇప్పటికే సగం మీద సముద్రంలోకి ఆ ప్రదేశం వెళ్లిపోయింది. ఆదేశం ఎక్కడుందీ.. సముద్రం ఎందుకు అంతలా విజృంభిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ దేశం ఫిజీకి ఉత్తరాన సరిగ్గా 1000 కిలోమీటర్ల దూరంలో ఫస్పిక్ సముద్రంలో ఉన్న ద్వీపదేశం దాని పేరు ‘తువాలు’. ఇది 25 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ దేశంలోని జనాభా 11,900. ఈ దేశానికి విమానాశ్రయం కూడా ఉంది. అయితే విమానశ్రయం నుండి వారానికి కేవలం మూడు విమానాలు మాత్రమే రాకపోకలను కలిగి ఉన్నాయి. విమానాలు రాకపోకలు లేనందు వల్ల పిల్లలు రన్ వే మీద ఆటలాడుతూ మనకు కనిపించడం ఇక్కడ గమనార్హం.
ఈ దేశం మొత్తం పర్యాటకంలో అత్యంత వెనుకబడి ఉన్న దేశంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తువాలు దేశాన్ని ప్రతి సంవత్సరం కేవలం 3,700 మంది మాత్రమే సందర్శిస్తారు. ఈ దేశం యొక్క ప్రధాన దీపంలో మాత్రమే మనుషులు నివసిస్తూ ఉంటారు. ఈ దేశంలో నాలుగు పగడపు దీవులు కూడా ఉన్నాయి. పర్యటకులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల
సంఖ్య కూడా అతి తక్కువగానే ఉంటుంది. విచిత్రమైన ప్రదేశాలను చూడాలనుకునే తాపత్రయం ఉన్నవాళ్లు ఇలాంటి దేశాన్ని సందర్శించారు. రోజు,రోజుకు పర్యావరణం మార్పు చెందుతూ ఉండడంతో ఇక్కడి సముద్ర జలాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ దేశం మరో 50 సంవత్సరాలలో పూర్తిగా నీట మునుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ దేశం చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పటికే సముద్రంలో కలిసిపోవడం గమనార్హం.