కొంతమంది పూజ(Pooja) చేసేటప్పుడు కొన్ని తప్పులను వారికి తెలియకుండానే చేస్తుంటారు. అయితే సరిగ్గా చేసే పూజలకు మాత్రమే శుభ ఫలితాలుంటాయని వేద పండితులు చెబుతున్నారు. అయితే ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే చాలామంది పూజ చేసేటప్పుడు తెలియకుండా తప్పులను చేయడం వల్ల శుభ ఫలితాలకు బదులుగా చెడు ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది.
పూజ చేసేటప్పుడు ఏ విషయాలపై ప్రత్యేకంగా దృష్టి ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన దిశలో పూజలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలుండే అవకాశం ఉంది. ఇంట్లో పూజ స్థలం లేదా దేవాలయం ఈశాన్య దిశలో ఉండడం మంచిది. పూజకు ఈ దిశ అత్యంత శుభప్రదం అని చాలామంది ప్రజలు భావిస్తారు. పూజ చేసేటప్పుడు ముఖాన్ని పడమర వైపు ఉంచడం ఎంతో మంచిది.
Also Read: ఇంట్లో తులసి, మనీ ప్లాంట్ ను ఏ దిక్కున పెట్టాలో తెలుసా..!?
భక్తులకు రోజువారి దర్శనం ఇచ్చే ఏకైక దేవుడు సూర్య భగవంతుడు ఉదయాన్నే ఆయనకు సమర్పించడం ఎంతో మంచిది. దీనివల్ల మీకు అదృష్టం మరియు సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. పూజ చేసేటప్పుడు నేలపై కూర్చోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ సమయంలో తప్పనిసరిగా ఆసనం వేయాలని చెబుతున్నారు. ఇంటి నుంచి ప్రతికూల శక్తులు దూరమై శుభ ఫలితాలు పొందడానికి ఉదయం, సాయంత్రం దేవాలయంలో దీపం వెలిగించడం ఎంతో మంచిది.
Discussion about this post