Entry into the Temple after Six is Prohibited : మన భారత దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. అయితే దేవాలయాలు తెరవడం, మూయడం కూడా సమయాలలో చాలా తేడా ఉంటుంది. కొన్ని దేవాలయాలు మాత్రం ఆరు నెలల పాటు మూసి ఉంటాయి. మరికొన్ని దేవాలయాలు ఒక్కో సమయాన్నిబట్టి నిర్ణయించబడి ఉంటాయి.
అయితే ఇప్పుడు మనం ఒక విశిష్ట దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఆరు దాటితే ఎవరిని ప్రవేశింపనియ్యరు. ప్రధాన ద్వారాన్ని మూసివేస్తారు. ఆలయం ఎక్కడ ఉంది? దాని విశిష్టత ఏమిటో ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకుందాం..ఈ ఆలయం బీహార్ లోని మాదాపూర్ జిల్లా ఆలంనగర్ తాలూకాలో ఉన్న ఒక గ్రామంలో ఉంది.
ఈ ఆలయాన్ని డాకిని ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ గుడిలోకి రోజంతా ఐదు సార్లు హారతి ఇస్తారు. సాయంత్రం ఆరు తర్వాత మాత్రం ఈ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. తిరిగి మర్నాడు ఉదయం 6 గంటలకు మాత్రమే తెరుస్తారు. అలా ఆరు గంటలకే మూయడానికి సరైన కారణం ఉంది.
సాయంత్రం ఆరు తర్వాత స్వయంగా డాకిని మాత ఆలయాన్ని సందర్శిస్తుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ ప్రగాఢంగా నమ్ముతారు. ఆ సమయంలో ఎవరూ చూడకూడదని ఇక్కడ ప్రజల నమ్మకం. ఒకవేళ అలా చూస్తే ఆ తల్లి ఆగ్రహానికి గురవుతారని వాళ్లు భయపడతారు. అందుకే సాయంత్రం ఆరు కాగానే లోపలికి మాత్రమే వెళ్ళనివ్వరు. ఆ సమయంలో ఆలయ పూజారులు కూడా గుడి నుండి వెళ్లిపోతారు.
సాయంత్రం హారతి అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ ఆలయం 1348 లో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని దుర్గామాత దేవాలయం అని కూడా అక్కడి స్థానికులు పిలుస్తారు. ఈ అమ్మవారికి మేకలను బలి ఇస్తారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ తంతు కొనసాగుతూ వస్తుంది. ఇది పూజలో అత్యంత కీలకమైన ఘట్టంగా స్థానికులు చెబుతారు. అంతేకాదు ఇక్కడ అమ్మవారికి లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టడం శుభప్రదం అని భక్తులు భావిస్తారు..