విఘ్నేశ్వరుడికి గరికలా సింధూరమంటే మహాప్రీతి.
విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమంటే పూర్వం ‘అనలాసురుడు’అనే, రాక్షసుడు తన సహజ సిద్ధమైన అగ్ని జ్వాలలతో లోకాలను దహించడానికి ప్రయత్నించినప్పుడు, వినాయకుడు ఆ రాక్షసుడిని మింగివేస్తాడు.
మహర్షులు సమర్పించిన గరిక వలన ఆయన ఉదరంలోని తాపం తగ్గిందట. అందుకే తనని గరికతో పూజించిన వారిని తప్పక అనుగ్రహిస్తాడు. ఇక గరిక సమర్పించడం వలన ఎంతగా సంతోషిస్తాడో, సింధూరంతో పూజించినా అదే విధంగా మురిసిపోతాడని పండితులు అంటున్నారు.
హనుమంతుడికే కాదు వినాయకుడికి కూడా సింధూరమంటే మహా ఇష్టమట. అందువలన గణపతిని సింధూరంతో అలంకరించినా , పూజించినా, శుభఫలితాలుంటాయని పండితులు అంటున్నారు.
ఓం గణాధిపతయే నమః