Garuda Purana : మనం ఈ జన్మలో చేసే పాప,పుణ్యాలను బట్టి మనకు వచ్చే జన్మ ఉంటుంది అని గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి భవిష్యత్తు ఖర్మపై ఆధారపడి ఉంటుంది. కర్మానుసారం మళ్ళీ జన్మ లభిస్తుంది.భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ప్రకారం పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణం ఖాయం అనేది మారని సత్యం.
అది జీవిత సత్యం. అయితే మరణించిన ప్రతి మనిషి వారి ఖర్మలను బట్టి మరో జన్మ ఎత్తడం కూడా భగవద్గీతలో రాసి ఉంది. ఇది కూడా మార్చలేని సత్యమే. గరుడ పురాణంలో 84 లక్షల జాతుల గురించి ప్రస్తావించబడింది. ఒక మనిషి మరణించిన తర్వాత ఆత్మ వేరే శరీరాన్ని ధరిస్తుంది. మరణం తర్వాత మీరు మరలా జన్మించాలి అనేది నిర్ణయించబడుతుంది.
జీవితంలో మీరు చేసే ఐదు కర్మలు మీ జననాన్ని నిర్ణయిస్తాయి. పవిత్ర గ్రంధాలను అవమానించే వ్యక్తులకు, భగవంతుడు పట్ల భక్తి లేనటువంటి వాడు, పూజల మీద నమ్మకం లేని నాస్తికులకు, గరుడ పురాణంలో తదుపరి జన్మలో కుక్కగా జన్మిస్తారని రాసి ఉంది..నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో రాబందులుగా జన్మిస్తారని ఉంది.
ఇంకొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అమాయకులను చూసి మోసం చేస్తారు. ఇలాంటివారు పునర్జన్మలో గుడ్లగూబగా జన్మిస్తారు. అని గరుడ పురాణంలో ఉంది.
దుర్భాషలాడేవారు, ఇతరులను దూషించేవారు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారు ,గరుడ పురాణంలో వచ్చే జన్మలో మేక రూపంలో పుడతారు అని రాసి ఉంది.