Mahanandi Temple : భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువైనాయి. వాటిల్లో మరెన్నో రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలోని కోనేరు కూడా ఇలాంటి జాబితాలోకి వస్తుంది. ఈ కోనేరులో నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ఎంతో స్వచ్ఛమైన నీటితో కోనేరు ఎప్పుడూ నిండుకుండలా కనిపిస్తుంది.
మహానంది క్షేత్రాన్ని తీర్థ క్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ దేవాలయంలో శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద నుంచి నీరు ప్రవహిస్తూ రుద్రగుండం కోనేరులోకి వస్తుంది. అక్కడి నుంచి మహావిష్ణువు గుండం కోనేరులోకి వస్తుంది. ఈ నీరు మహానంది చుట్టుపక్కల వందల ఎకరాల పంట పొలాలకు నీటిని అందిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కడ తవ్వినా 10 అడుగులలోనే జలం ఊబికి వస్తుంది. అయితే మహానంది క్షేత్రం కోనేరులోని నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది అంతు పట్టనీ రహస్యం.
ఆ కోనేరు చుట్టుపక్కల వందలాది ఎకరాలు సాగునీరును అందిస్తుంది. కానీ ఈ కోనేరులోకి నీరు ఎలా వస్తుంది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే వర్షాకాలంలో, వేసవికాలంలో కూడా కోనేరులోని నీటి శాతం ఎప్పుడు సమాన స్థాయిలోనే ఉంటుంది. వేసవికాలంలో తగ్గుముఖం అసలు పట్టదు. ఇదే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ కోనేరులోకి మొత్తంగా ఐదు మార్గాల గుండా నీరు వచ్చి చేరుతుంది. ఈ ఐదు మార్గాలు ఎక్కడినుంచి వస్తున్నాయి అనేది ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.
చాలామంది ఈ రహస్యాన్ని చేదించాలని ప్రయత్నించినప్పటికీ అది ఎవరి వరం తరం కాలేదు.. ఎంతో పవిత్రంగా చెప్పుకునే ఈ కోనేరులో స్నానమాచరిస్తే మనకున్నటువంటి సకల అనారోగ్య సమస్యలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. అందుకే దేశం నలుమూలల నుండి ఈ కోనేరులో స్నానమాచరించడానికి ప్రజలు వస్తూ ఉంటారు. అయితే ఈ కోనేరు రహస్యన్నీ చేదించడానికి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. కానీ ఎటువంటి సమాధానం దొరకలేదు.