Nirjala Ekadashi : హిందూ సంప్రదాయ ప్రకారము లక్ష్మీదేవి పూజ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందులోనూ ఏకాదశి రోజు చేసే పూజలకు అత్యంత ప్రాధాన్యత. అయితే ఈ ఏకాదశులు సంవత్సరానికి 24 వస్తాయి. వాటిల్లో అత్యంత ప్రాముఖ్యమైనది నిర్జల ఏకాదశి. ఏకాదశి ఈరోజు అనగా మే 31వ తేదీ బుధవారం రోజు ఈ సంవత్సరానికి గాను వచ్చింది. ఏకాదశి రోజు లక్ష్మీదేవతను ఎలా పూజించాలి.
అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏ విధానాలు పాటించాలి తెలుసుకుందాం. నిర్జల ఏకాదశిని భీమసేనుడి ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే భీమసేనుడు ఈ రోజున ఉపవాసం ఉన్నాడు అని చెబుతారు. అందుకే ఈ ఏకాదశికి ఆ పేరు వచ్చింది. నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల అన్ని ఏకాదశుల ఉపవాస ఫలం దక్కుతుందని శాస్త్రాల్లో రాసి ఉంది.
ఏకాదశి రోజు సూర్యోదయం మొదలు ద్వాదశి సూర్యోదయం వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని స్వీకరించి, విష్ణుమూర్తిని సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్ర నామం, అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేసి పూజించాలి. ఆ రకంగా ఉపవాసం ఆచరిస్తే మానవ జన్మకు మోక్షం కలుగుతుంది.
ఏకాదశి రోజు చాలామంది వటసావిత్రి వ్రతాన్ని కూడా నోచుకుంటారు. హిందూ సంప్రదాయంలో ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు వివాహిత స్త్రీలు మర్రిచెట్టును పూజించు ప్రదక్షిణ చేయడం వల్ల వారి వివాహ బాంధవ్యం బలపడుతుంది. ఎవరైతే ఈ నిర్జల ఏకాదశి రోజు ఉపవాసాన్ని నిష్టగా పాటిస్తారో. వారి జీవితంలో సకల,సంపదలు లభిస్తాయి. వారి పాపాలన్నీ నివృత్తి అవుతాయి.
ఏకాదశి రోజు రావి చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు, నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజు జలదానం, అన్నదానం చేసినా కూడా ఆ లక్ష్మి దేవి కటాక్షం సిద్ధిస్తుంది.