Spirituality : గుడికి వెళ్ళగానే మనం మొదట చేసే పని కాళ్లు కడుక్కొని, ఆలయంలోకి ప్రవేశించి, దైవదర్శనం చేసుకుంటాము. అయితే గుడిలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. గుడిలోకి ప్రవేశించగానే ముందుగా ఎలాంటి పనులు చేయాలి, వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ముందుగా
కాళ్ళను కడుక్కున్న తర్వాత, గుడి ప్రధాన ముఖద్వారానికి ఉన్న గడపకి నమస్కారం చేస్తారు. అలా ఎందుకు ముందుగా గడపకు నమస్కరిస్తున్నారు అని అంటే.. ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే అది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం, పూర్వికులు ఆచరించారూ కాబట్టి వారసత్వంగా ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారు.
కానీ ముందుగా గడపకు ఎందుకు నమస్కరించాలి అనేదాని వెనక ఒక కథ దాగి ఉంది. గుడి యొక్క గడపను మనం గమనించినట్లయితే అది రాతితో తయారు చేసి ఉంటుంది. సహజంగా ఇంటి గడపలు చెక్కతో తయారు చేసినవి ఉంటాయి. కానీ గుడి గడపలు మాత్రం రాతితో తయారు చేసినవి ఉంటాయి. మరి వాటి వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి.?
ముగ్గురు భక్తుల వెనుక దాగివున్న కథ అది. ముగ్గురు భక్తుల కోసం ఆ భగవంతుడు కూడా కొండమీదనే వేలిసాడు. ఆ ముగ్గురు భక్తులు ఎవరంటే భద్రుడు అనే రుషి భద్రావతి అనే పర్వతం గానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాల్లో ఉంది. ఆ ముగ్గురు భక్తులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం..ఆ కొండరాళ్ళ మీద కొలువై ఉన్నందున ఆ కొండరాల నుంచి వచ్చిన
రాయిని మలిచి ఆలయ గర్భగుడులకు ముఖ్య ప్రవేశ ద్వారంగా అమరుస్తారు. ఆ కొండ నుంచి తీసుకొచ్చిన రాయి నిత్యం ఆ భగవంతుని నామస్మరణలో పూజలు అందుకుంటుంది. అలాంటి రాయిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తూ తప్పకుండా ఆ రాయికి నమస్కరించి గుడి లోపటికి ప్రవేశిస్తారు.