Sravanamasam : శ్రావణమాసం అంటేనే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పుకుంటారు. ఈ మాసం మొత్తం ఆ లక్ష్మీదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు కోలుచుకుంటారు. అయితే శ్రావణమాసం ముగిసే వరకు మాంసాహారాన్ని ముట్టకూడదని ఒక నిష్ట ఉన్నది. మరి శ్రావణమాసంలో మాంసాహారాన్ని ఎందుకు ముట్టరాదు.. దాని వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం..
శ్రావణమాసంలో మాంసాహారాన్ని తినకూడదని శాస్త్రీయ బద్ధమైన కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చితార్ధాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, వ్యాపారాలకు సంబంధించినటువంటి ముహూర్తాలు శుభకార్యాలను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. జులై మధ్యలో మొదలైన శ్రావణమాసం ఆగస్టు వరకు ఉంటుంది. కొన్నిసార్లు అధికమాసం కూడా వస్తూ ఉంటుంది.
శ్రావణ మాసంలో మాంసాహారాన్ని అస్సలు ముట్టరు. శాఖాహారాన్ని తీసుకుంటారు. దీని వెనక శాస్త్రీయ కారణం ఏంటంటే.. వర్షాకాలంలో ఈ శ్రావణమాసం రావడం వల్ల కొన్ని ఆహారా పదార్థాలు తినకూడదు అని చెబుతారు. ఎందుకంటే కొన్ని రకాల వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు సూచిస్తారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువ. అలాగే నీటి పరిశుద్ధత లోపం వల్ల జంతువులలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
అలాంటి మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు ఆ అంటువ్యాధులు మనుషులకు కూడా సంక్రమిస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ కాలంలో చేపలు సంతానోత్పత్తిని చేస్తూ ఉంటాయి. కాబట్టి శ్రావణమాసంలో జలచరాలను తినకపోవడమే ఉత్తమం. కొన్ని జలచరాలు వ్యర్ధాలను నీటిలో వదులుతూ ఉంటాయి. ఆ వ్యర్ధాలను చేపలు తీసుకుంటాయి. అలాగే గర్భిణీగా ఉన్న జలచరాలను తినకూడదని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు.
అలాగే ఈ కాలంలో మనిషి యొక్క జీర్ణవ్యవస్థ అతి బలహీనంగా ఉంటుంది. పేగులలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆ కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. వాతావరణంలో ఏర్పడుతున్నటువంటి మార్పుల కారణంగా మానవ శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. కాబట్టి ఈ శ్రావణమాసం మొత్తం ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు.