Temple : మనలో చాలామంది కొన్ని చోట్లల్లో చెప్పులను పోగొట్టుకుంటారు. ముఖ్యంగా గుడికి వెళ్ళిన సమయంలో చెప్పులు ఎక్కువగా పోతూ ఉంటాయి. మరి గుడిలో చెప్పులు పోవడం శుభమా లేక అశుభమా ..శాస్త్రాలు ఈ విషయం గురించి ఏం చెబుతున్నాయి. చెప్పులు అలా మాయం అవడానికి అసలు కారణాలు ఏంటి.?
దేవాలయాలలో ఎక్కువగా చెప్పులను దొంగిలిస్తూ ఉంటారు. మన చెప్పులు దొంగతనానికి గురి అయితే మనకు మంచి జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున ఆలయంలో చెప్పులు పోగొట్టుకుంటే మన జీవితంలో ఉన్న అరిష్టం, శని అన్ని తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
గుడిలో చెప్పులు దొంగిలిస్తే ధనవంతులవుతారని, ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అప్పులు తీరిపోతాయని చాలా ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే చాలామంది చెప్పులను దొంగిలిస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. మానవుని శరీరంలో శని నివాసం పాదాలలో ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం మన అవయవాలను శాసిస్తూ ఉంటుంది.
శని నుండి ఏదైనా సమస్య ఉంటే మొదటగా మన అవయవాలలో కనిపిస్తుంది. అంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు మన అవయవాల మీద ప్రభావం చూపించి మోకాలి నొప్పి, పాదాలలో వాపు మొదలైన వాటిని సృష్టిస్థాయి. ఈ ఇబ్బందిని తొలగించుకోవడానికి సాధారణంగా భక్తులు హనుమంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారు.
నొప్పి నయం చేసుకోవడానికి హనుమంతుడిని వడమాలతో పూజిస్తారు.ఆ శని దేవునికి, హనుమంతుడు ఇచ్చిన వరం ప్రకారం.. శని ప్రభావం భక్తుల పైన చూపిస్తూ ఉంటాడు. శని ప్రభావం పాదాల మీద ఉంటుంది కాబట్టి, పాదరక్షలు పోగొట్టుకుంటే ఆ శని నుండి మనకు విముక్తి కలిగినట్టే అని మనం భావించాలి.
ఒక జత పాదరక్షలు దానం చేయడం వల్ల ఆ శనిదేవుడి దయ మన పైన ఉంటుంది అని శాస్త్రాలు చెపుతున్నాయి. కొందరు కావాలనే తమ పాదరక్షలను ఆలయంలో వదిలేసి వస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, వారి జాతకంలో ఉన్న దోషాలు పోయి, సంతోషంగా ఉంటారనేది వారి విశ్వాసం.