Twilight Lamp : సనాతన ధర్మంలో ఒక మనిషికి కావలసిన సిరిసంపదలు, ఆనందం అనేక విషయాల గురించి వివరించారు, వాటిని పాటించడం వల్ల అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. రోజు ప్రారంభమైనప్పటినుండి తిరిగి రాత్రి నిద్రించే వరకు పాటించాల్సిన చిన్న,చిన్న నియమాలను, మన సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం లో విపులంగా వివరించారు. దాంట్లో ప్రత్యేక స్థానం కలది సంధ్య దీపం.
దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపమని వేదం చెబుతుంది. దీపకాంతి జ్ఞాన సూత్రానికి చిహ్నం ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే దీపానికి అంత ప్రాముఖ్యత. దీపం వెలిగించకుండా ఎటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీపానికి వాడే నెయ్యి లేక తైలము మనలోని కోరికలకు ప్రతీక. దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీక.
మనలోని అహంకారాన్ని కాల్చేసి, కోరికలను ఆవిరి చేయడానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాము. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపాన్ని ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర వెలిగిస్తే, ఆ లక్ష్మీదేవి చల్లని చూపు ఆ ఇంటిపై ఉంటుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రాహు దోషం నుండి విముక్తి
పొందాలంటే, రోజు సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఏ ఇంటి ముందర అయితే ప్రతిరోజూ దీపం వెలిగిస్తారో, ఆ ఇంట్లో దారిద్రం ఉండదు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి.
సంధ్య దీపం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల శక్తి వస్తుంది. ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ కూడా ఆనందోత్సాహాలతో విరాజిల్లుతుంది. దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి హానికారక కీటకాలు ప్రవేశించవు. ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. ఇది సైంటిఫిక్ గా కూడా రుజువయింది. కాబట్టి ప్రతి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించి, ఆ ఇంట్లో శుభాలు, సుఖసంతోషాలు పొందవచ్చు.