Rashmi Gautam Tweet : బుల్లితెరపై యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్. చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. రష్మీ మంచితనం, సేవా కార్యక్రమాలు, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆమెకు మంచి ఇమేజ్ను కట్టబెట్టాయి. సోషల్ మీడియాలో రష్మీ వేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంది.
అయితే రష్మీ కెరీర్ పరంగా ఎలా ఉన్నాకాని పర్సనల్ గా చాలా సెన్సిటివ్. రష్మీ పూర్తి శాఖహారి కనీసం పాలు కూడా తాగదు. ఎందుకంటే పాల కోసం మూగ జీవులను హింసిస్తారని చెప్పి తనవంతుగా పాలకు సంబంధించిన ఏ పదార్థాలను తీసుకోదు. పూర్తి వేగన్.. అంతేకాదు రష్మీ జంతు ప్రేమికురాలు. ఎక్కడైనా సరే జంతువులకు హాని కలిగించారంటే ఆమె అసలు ఊరుకోదు. అయితే తాజాగా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mahesh Babu : మరోసారి మంచి మనసును చాటుకున్న సూపర్ స్టార్..
అయితే ఇటీవల ఢిల్లీలో ఓ యువకుడు కుక్కపిల్లను వేధిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో అది చూసిన రష్మి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. అతను చాలా క్రూయల్ గా ఉన్నాడు. అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదం. పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు. అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేసింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
https://twitter.com/rashmigautam27/status/1678428613702725633?t=ESdzsFhke6U_lSaCuNeYvA&s=19