Pawan Kalyan With New Incharges : జనసేన పార్టీ ఒకవైపు వారాహి యాత్ర, జనసేన పార్టీలో కొత్త నాయకుల అలాగే యువత, కార్యకర్తల చేరికతో, నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకాలతో పార్టీ కొత్త ఊపును అందుకుంది.. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను నియమిస్తూ జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి టి.వి. రామారావులను నియమించారు. టి.వి. రామారావు గతంలో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఈ ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారు ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నియామక పత్రాలను అందజేశారు.
అదే విధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కార్యక్రమాల నిర్వహణ కమిటీ)గా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ను నియమిస్తూ నియామక పత్రం అందచేశారు. నూతనంగా నియమితులైన వారికి పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు. ప్రజలకు అవిరళమైన సేవలు అందించాలని, పార్టీ అభివృద్ధికి దోహదపడాలని పవన్ కళ్యాణ్ వారికి సూచించారు.
ఇప్పటి వరకు రాజానగరం ఇంచార్జి బాధ్యతలు నిర్వర్తించిన మేడా గురుదత్, పిఠాపురం ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన శ్రీమతి మాకినీడు శేషుకుమారిలకు పార్టీలో మరో ముఖ్య పదవి అప్పగిస్తామని, వారి సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.