దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 5వ తేదీన జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
గతంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందలేదు.
కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే దానికి హాజరయ్యారు.
మరి బిజెపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామమందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ ఆహ్వానిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Discussion about this post