సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అసలు ఇప్పుడేం చేస్తున్నారు?
కేంద్ర సర్వీసుల నుంచి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన లక్ష్మీ నారాయణ రాజకీయ జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయని తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు కొద్దో గొప్పో ఆదరణ ఉంది. అన్ని జిల్లాల్లో ఆయనకు సన్నిహితులు, శ్రేయోభిలాషులు వున్నారు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఆయన మొదట్లో అత్యంత ప్రభావితం చూపించగలిగారు.
జనసేన పార్టీలోకి చేరడానికి ముందే ఆయన రాష్టవ్య్రాప్తంగా రైతు చైతన్య యాత్రలు నిర్వహించి అప్పటికే జనాల్లో తనకున్న గుర్తింపుని మరింతగా పెంచుకున్నారు. ఈ దశలో ఆయనకు వైసీపీ టీడీపీ నుంచి కూడా ఆహ్వానం అందింది.
కాకపోతే కొత్తపార్టీ పెట్టే ఆలోచనలో కొన్నాళ్ళు వేచిచూసి తర్వాత తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న జనసేన పార్టీలో చేరారు. జనసేన ఘోర పరాజయం తర్వాత పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ప్రస్తుతం
మౌనం గా వున్నారు. విశాఖపట్నం నుంచే మళ్లీ బరిలో దిగాలని కొన్నాళ్ళు వేచి చూసి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది ప్రస్తుతానికి సందేహాస్పదంగా ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు జేడీ కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.