రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నారు.బీజేపీ జనసేన పొత్తు తర్వాత రానున్న అన్ని ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ఇప్పటి వరకూ సమగ్రమైన చర్చ జరగకపోయినా ఆయా పార్టీలు బలాలు పెంచుకోవడంలో మాత్రం దృష్టిసారించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో జరిగిన పరాభవం తర్వాత మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో తమదైన పాత్ర పోషించడానికి ఉత్సాహంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజేపీ వరకూ సీమాంధ్రలో పటిష్టమైన నిర్మాణం వున్నా నాయకత్వలోపంతో ఇబ్బంది పడుతున్న సంగతి గమనించిన బీజేపీ అధిష్టానం కొంతవరకూ ముందు చేరికలపై దృష్టి పెట్టింది.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కీలకమైన నాయకులు బీజేపీలోకి వచ్చినా వారి సేవలు ఇంకా పార్టీ ఉపయోగించుకోలేపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. హిందుత్వ వాదులు దిగువ మధ్యతరగతి ప్రజల్లో పార్టీకి ఉన్న సానుకులతని ఓట్లగా మలచుకోవడంలో పార్టీ వైఫల్యాలను గురించి అంతర్గతంగా చర్చిస్తున్నారు
ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి ఉన్న లక్షలాదిమంది అభిమానులు వేలాదిమంది కార్యకర్తలు ఉండటం,మెజారిటీ సామాజిక వర్గం అండదండలు,పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ అదనపు బలంగా ఉన్నాయి. రేపు ఎన్నికల రంగంలో పవన్ జనాకర్షణ శక్తి తో బాటు ఆయన ఉపన్యాసాలు సైతం ఆ పార్టీ కి ప్లస్ పాయింట్ అవుతాయి.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల రంగంలోకి బీజేపీ జనసేన కూటమి బరిలోకి దిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Discussion about this post