ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకునే ముందు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారో లేదో అనే అనుమానం కలుగుతుంది.
ఎందుకంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రతిపక్షాల నుండి కాకుండా రాష్ట్ర హైకోర్టు నుండే ఎక్కువగా అడ్డంకులు
ఎదురవుతున్నాయి.
మొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ తన చుట్టూ అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులను న్యాయనిపుణులను నియమించుకోవడం లో ఒకింత విఫలమయ్యారని,అందుకే ప్రతిసారి కోర్టులలో చుక్కెదురవుతుందని రాజకీయ నిపుణుల అభిప్రాయం.
ఇకపోతే, మూడు రాజధానులు అంశంలో పాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ రద్దు బిల్లులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాజ్ భవన్, సచివాలయం, సీఎం కార్యాలయం, పోలీస్ శాఖల కార్యాలయాలు తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
మంగళవారం దీనిపై విచారణ చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా లేక ఎప్పటిలాగే ఎదురుదెబ్బ తగులుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ తీర్పు వస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అతి పెద్ద ఎదురుదెబ్బ గా నిలుస్తుంది.
Discussion about this post