ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు గా ఎన్నికైన సోము వీర్రాజుకు ఆ పదవి కత్తి మీద సాము కానుందా??
అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకులనుంచి. సోము రాకపై బీజేపీలో ఒకవర్గం గుర్రుగా ఉంది. భారతీయులు జనతా పార్టీలో సోముకు వ్యతిరేకంగా కొంతమంది పావులు కదుపుపతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
రాజధాని వికేంద్రీకరణ అంశంలో బీజేపీలో రాష్ట్ర పార్టీ అమరావతి కే మా మద్దతు అని చెప్పినప్పటికీ
గవర్నర్ విశ్వాభూషణ్ బిల్లుకి రాజముద్ర వేయడంతో కొంతమంది కొత్తగా బీజేపీలో చేరిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము టీడీపి పై కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో వారికి మింగుడు పడటం లేదు.
సోము నాయకత్వంలో పని చెయ్యక తప్పని పరిస్థితుల్లో విరుద్ధమైన ప్రకటన చేస్తే బీజేపీ అధ్యక్షుడు గా ఆయన కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయని తద్వారా అధిష్టానం ముందు తమకు చివాట్లు తప్పవని వారు భావిస్తున్నారు. వీర్రాజు దూకుడు కి కళ్లెం వేసే పరిస్థితి లేక ఇటు పార్టీ లో ఇమడలేక వారు ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.