Ap Mlc Elections:వైసీపీకి పవన్ హెచ్చరికలు… తీరు మారకుంటే గుణపాఠం తప్పదని హితవు
ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఇకనుండి అయినా జగన్ నేతృత్వం లోని ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హెచ్చరించారు.లేకుంటే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని హితవు పలికారు.
తాజాగా పవన్ మాట్లాడుతూ “నిన్న జరిగిన గ్రాడ్యూయేట్ MLC ఫలితాలు ప్రభుత్వం పై వ్యతిరేకతని తేటతెల్లం చేశాయని,ఈ ఫలితాలు అధికారపక్షానికి హెచ్చరికలు జారీచేశాయి అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని అన్నారు.అధికారం తలకెక్కిన వైసీపీకి పట్టభద్రులు కనువిప్పు కలిగించారని.. పరిస్థితులు ఇలానే ఉంటే గనుక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితాలే వస్తాయని, ప్రజాకంటక పాలనకి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు అని పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.