AP Road Accident :ఘోర రోడ్డు ప్రమాదం … ఐదుగురు మృతి
అసలే అంతంతమాత్రం రోడ్లు.. పైగా మితిమీరిన వేగమో లేక డ్రైవర్ తప్పిదమో కానీ,ఈ రోడ్డు ప్రమాదాల వల్ల నిండు జీవితాలు బలయ్యి.. సంతోషంగా ఉన్న కుటుంబాలు రోడ్డు పాలవుతూ చిన్నాభిన్నం అవుతున్నాయి
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పార్వతిపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం చోళవరం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.వీరంతా ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Discussion about this post