ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటుంది. కరోనా సోకి ఎవరైనా చనిపోతే భారత్ లాంటి జనాభా ఎక్కువ కలిగిన దేశాల్లో అలా చనిపోయినవారి మృతదేహాలను ఖననం చేయడం పెద్ద సమస్యగా మారింది.
అపోహలతో వారి అంత్యక్రియలను అడ్డుకోవడం చాలా చోట్ల జరుగుతుంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఈ సమస్యపై షికాగో (అమెరికా)లోని ఇల్లినాయిస్ వర్సిటీ అంటువ్యాధుల వైద్యనిపుణులు డాక్టర్ విజయ్ ఎల్దండి మాట్లాడుతూ మృతదేహాలతో కరోనా వ్యాపించదన్న వాస్తవాన్ని అంతా గమనించాలని ఆయన సూచించారు.అలా మృతదేహాల ఖననం అడ్డుకోవడం సంస్కారం కాదనీ, దీనిపై అనవసర భయాందోళనలు వద్దనీ, ప్రజలు మానవత్వంతో మసలాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిబంధనలను విధిగా పాటించాలన్నారు.
కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటున్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న డా.విజయ్ పై విధంగా స్పందించారు.