MLA Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీకి రోజురోజుకీ జనాధారణ పెరుగుతోంది. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్ లో వైకాపా పార్టీ పట్ల ప్రజలు, నాయకులు అసంతృప్తితో ఉన్న కారణంగా క్రమక్రమంగా పార్టీ ని వీడుతూ ఏకంగా వైకాపా పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వైకాపా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు జనసేన పార్టీ నాయకుడు పృథ్వీ ఓ ప్రముఖ మీడియా చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja)పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hero Mahesh : సినిమా ఆఫర్లు లేక మద్యం అలవాటుకి బానిసయిన హీరో మహేష్.. చివరికి ఏమైందంటే..?
రోజా (MLA Roja) ఓడిపోవడం ఖాయం:
ఇందులో భాగంగా గతంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కచ్చితంగా వైకాపా పార్టీ ఓటమి పాలవుతుందని అన్నారు. ఈ క్రమంలో నటి మరియు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా ఓటమి ఇప్పటికే ఖాయం అయ్యిందని ఈ క్రమంలో వైకాపా పోటీ చేసి ఓడిపోయే నియోజకవర్గాల్లో నగరి మొదటి స్తానంలో ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రోజా ఒడిపోవడానికి గతంలో ఆమె దళితులపై మరియు ఇతర నాయకులపై చేసిన అసందర్భ మరియు అనుచిత వ్యాఖ్యలే కారణమని అన్నారు.
జనసేన మరియు టీడీపీ పార్టీలు అధికారంలోకి వస్తాం:
అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో బాణ సంచా పేలుస్తూ, స్వీట్లు పంచుతూ సెలెబ్రేట్ చేసుకున్నారని ఇది సరికాదని అన్నారు. అలాగే తనపై కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తనకి తెలిసిన మరియు అప్పుడప్పుడూ తిరుమల దర్శనానికి తీసుకెళ్ళే నటీమణులతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించిందని అన్నారు. అంతేగాకుండా ఎమ్మెల్యే రోజాపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయని జనసేన – టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయించి కటకటాల్లోకి పంపిస్తామని అన్నారు. ఇక జనసేన మరియు టీడీపీ పార్టీలు కచ్చితంగా గెలిచి అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం పృథ్వీ మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
BalaKrishna & Boyapati : సీన్ రివర్స్.. బాలయ్య హిట్ సినిమాని బీట్ చేసిన బోయపాటి ఫ్లాప్ మూవీ
దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు:
ఈ విషయం ఇలా ఉండగా గతంలో ఎమ్మెల్యే రోజా పలు సందర్భాలలో దళితులను కించపరుస్తూ మాట్లాడటం అలాగే పలువురు ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ కారణంగానే రోజా కి తన సొంత నియోజకవర్గమైన నగరిలో తీవ్ర వ్యతిరకత ఉందని అందుకే ఈసారి ఓటమి తప్పదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి.