సోమవారం దేశ రాజధాని ఢిల్లీ లో కొత్తగా 805 కేసులు నమోదు అయ్యాయి. గత రెండు నెలల కాలం లో ఇదే అతి తక్కువ సంఖ్య. సోమవారానికి ఢిల్లీ లో నమోదు అయిన మొత్తం కేసులు 1,38,482 గా అధికార వర్గాలు వెల్లడించాయి.
సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఢిల్లీ లో నిన్న మొత్తం 10,133 టెస్ట్ లు చేయగా అందులో 3,904 RTCPR టెస్ట్ లు మరియు 6,229 రాపిడ్ టెస్ట్ లు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
మే27 న ఢిల్లీ లో 797 కేసులు నమోదు అయ్యాయి ఆ తర్వాత కేసులు వేగంగా పెరిగి ఒకానొక దశలో రోజూ 3000 పైనే కేసులు నమోదు అయ్యాయి.
ఏది ఏమైనా ఢిల్లీ లో కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం గా చెప్పొచ్చు ఇదే విధంగా మిగతా రాష్ట్రాలు వైరస్ ని కాంట్రోల్ చేయడం లో బాగా పనిచేస్తే అతి త్వరలోనే ఇండియాలో కేసులు తగ్గుముఖం పడతాయి అనడం లో సందేహం లేదు.