Elections of Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అధికార పార్టీల్లో గుబులు మొదలు అయింది. ఎందుకంటే ప్రజల చేతుల్లోనే పార్టీల భవిష్యత్తులు ఆధారపడి ఉంటాయి కాబట్టి. అయితే ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో, వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకోవడానికి, సాధారణంగా ఎన్నికలు జరిగే కొన్ని రోజుల ముందు అధికార పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీ తరపున అంతర్గత సర్వేలు ప్రజల్లో నిర్వహిస్తారు. ఇది చాలా సంవత్సరాలుగా ఎలక్షన్ ముందు జరిగే తతంగమే..
ఆ విశ్లేషణ ద్వారా ప్రజల నాడి ఎటువైపు ఉందనేది పార్టీలకు స్పష్టత వస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నరు అనేది మాత్రం చాలా అస్పష్టంగా మారిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. అధికార పార్టీల మాదిరిగానే ప్రతిపక్షాలు కూడా ఈ రహస్య సర్వేలను నిర్వహిస్తాయి. ఆ సర్వేల ద్వారానే వారి ఎలక్షన్స్ ఎజెండాను రూపుదిద్దుకుంటాయి. ప్రచారానికి ఎలాంటి అస్త్రాలను వాడాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఈ విశ్లేషణను బట్టి వారు ఒక అంచనాకు వస్తారు.
అయితే ఈసారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలలో ఓటరు ఎటువైపు ఉన్నాడనేది మాత్రం రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఈ విశ్లేషణలో మీడియా ఒక అడుగు ముందే ఉంటుంది. వాళ్ళు చేసిన సర్వేలను బట్టి మనకు ఒక అప్ డేట్ ని ఇస్తారు. ఆ సర్వేలలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ రాబోతుంది. ఆ పార్టీ గెలవడం కష్టమే.. ఇలాంటి న్యూస్ ని మనకు ముందే అందిస్తారు.
కానీ కొన్ని సందర్భాల్లో మీడియా ఇస్తున్న న్యూస్ కూడా అట్టర్ ప్లాప్ అవుతుంది. ఈరోజు ప్రజల్లో ఉన్న ఆలోచన ఓటింగ్ తేదీలోపు మారిపోవడమే దీనికి కారణం. ముఖ్యంగా తెలంగాణలో బహుముఖ పోటీ జరుగుతుందని మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు సమస్యల్లా తెలంగాణలో ఏ పార్టీని విజయం వరిస్తుందో అంచనా వేయలేక పోవడమే. తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయంపై ఎటు తేల్చలేక తల పట్టుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే తెలంగాణలో ప్రధానంగా పోటీ రెండు పార్టీల మధ్యనే. ఒకటి బీఆర్ఎస్ రెండవది కాంగ్రెస్. అక్కడ బిజెపి మాట అంతంతమాత్రంగానే వినిపిస్తుంది. ఒక వైపు చూస్తే బీఆర్ఎస్ చేసిన అవినీతి పనుల వలన ఈసారి కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఒక వాదన వినిపిస్తుంటే.. మరోవైపు తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత కేసిఆర్ ది కాబట్టి కచ్చితంగా బీఆర్ఏస్ గెలుస్తుందని మరో వాదన వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరోరకంగా ఉంది. జగన్ కు చాలా అద్భుతమైన ప్రజాదరణ ఉంది, కచ్చితంగా ఈసారి కూడా జగనే గెలుస్తాడు అని ఒక వాదన, అయితే కనీస మౌలిక సదుపాయాల కల్పనలో, ఉద్యోగిత శాతం పెంచడంలో జగన్ అట్టర్ ప్లాఫ్ అయ్యాడని ఈ విషయాల దృష్ట్యా ఆ పార్టీ గెలవడం కష్టమే అని మరో వాదన వినిపిస్తుంది. అక్కడ జగన్ కి జనసేన టిడిపి పొత్తు బాగా ఎఫెక్ట్ పడేలాగానే తోస్తుంది.
ఇక ప్రజల విషయానికొస్తే ఎన్ని సర్వేలు చేసినా, ప్రజాభిప్రాయాలను ఇప్పుడు వెల్లడించినా కూడా చివరికి ఓటింగ్ తేదీ నాడు ప్రజల ఆలోచనలో ఎవరు ఉంటారో వారిదే తుది విజయం. చూద్దాం ఈసారి విజయం ఎవరిని వరించనుందో. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.