కరోనాతో మరణించిన వారి మృతదేహంపై ఆ వైరస్ కేవలం 6 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ నేటి రోజున అలా మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి చాలా చోట్ల అడ్డుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.
అలా ప్రజలలో ఉన్న అపోహలు తొలగించడానికి
జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ గుప్తా తిరుపతి ఎస్పీ శ్రీ గిరిషా గారితో కలీసి కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలలో స్వయంగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఇకపై అపోహలు వీడి చనిపోయిన వారిపై వివక్ష చూపరాదని పిలుపునిచ్చారు.