Janasena Chief Pawan Kalyan : “చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు.” వీరులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. అని “అల్లూరి సీతారామరాజు” నూరవ వర్ధంతి సందర్భంగా ఆయన పోరాట రూపాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రజలు తమ దాస్యశృంఖనాలను తెంచుకొని, స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి ,
అల్లూరీ సీతారామరాజులాంటి మహా యోధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం మరణించారణాని,ఈ రోజు ఆయోధుడిని తలుచుకొని వినయ పూర్వక అంజలి ఘటిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటితరం దేశవాసులు అందరికీ అల్లూరి సీతారామరాజు పోరాటం, దీరత్వం, మరణానికి కూడా వెరువనితనం ,ఒక స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
అలాంటి పోరాట యోధుడు, ప్రజల కోసం ప్రాణాలను త్రుణప్రాయంగా వదిలేసిన ఆ మహానుభావుడికి, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా “భారతరత్న” ప్రకటించి ,ఆయోధుని పోరాటాన్ని నలుదిక్కల చాటాలని అభిప్రాయపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తామే స్వీకరిస్తామని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు.