Janasena in Eluru : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొమడవోలు పంచాయతీ లో ఏలూరు నియోజవర్గంలో ఉన్న పేద ప్రజలకు ఇళ్లను ఇవ్వడానికి ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికి చెరువులు తలపించే విధంగా ఉన్నాయి.
కనీసం ఈ కాలనీలో నాణ్యమైన రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని పైగా 20 లక్షల మంది పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుస్తామని మాయమాటలు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కాలనీలో పరిస్థితి చూస్తుంటే అదోగమనంగా ఉన్నాదని, కనీసం ఈ కాలనీలు అభివృద్ధి చెందాలంటే 30 సంవత్సరాలు పడుతుందని వ్యాఖ్యానించారు.
కేవలం బేస్మెంట్లతో పనులు ప్రారంభించి గృహాలను నిర్మాణం చేయకుండా కాలయాపన చేస్తున్నారని,బడా కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పజెప్పి నాసిరకం నిర్మాణాలు చేస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మరో ఆరు నెలల పాటు మీ ప్రభుత్వం కొనసాగుతుంది.
తదుపరి జనసేన ప్రభుత్వం వచ్చి ఈ కాలనీల నిర్మాణాలు పనులు పూర్తి చేసి ప్రజలకు గృహప్రవేశం చేసుకునే విధంగా తయారుచేసి రవాణా సౌకర్యాలకు గాని నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జనసేన పార్టీ చూస్తాదని తెలియజేశారు.