• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

Janasena Party : మ్యాటర్ వెరీ క్లియర్.. తీవ్ర ఒత్తిడిలో వైఎస్ జగన్, ఓటమి భయంతోనే జనసేన సిబ్బందిపై బెదిరింపులు

Satya by Satya
March 7, 2024
in Janasena News, Latest News, Political News
0 0
0
Janasena party

Janasena party

Spread the love

Janasena Party : మ్యాటర్ వెరీ క్లియర్.. తీవ్ర ఒత్తిడిలో వైఎస్ జగన్, ఓటమి భయంతోనే జనసేన సిబ్బందిపై బెదిరింపులు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ విపక్షాలపై అధికార పార్టీ దాడులు ఎక్కువవుతున్నాయి. తాజాగా జనసేన సెంట్రల్ ఆఫీస్ లో పనిచేసే సిబ్బంది నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. అది కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత.

ఎలాంటి కారణాలు చెప్పకుండా రాత్రి 10 తర్వాత వచ్చి గదులు తనిఖీ చేయాలని సిబ్బందిని బెదిరించారు. తాళాలు తమ వద్ద లేవని చెప్పినా మెడ పట్టుకుని నెట్టడం, రివాల్వర్ చూపించడం లాంటి సంఘటనలకు పోలీసులు పాల్పడ్డట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. పోలిసుల బెదిరింపులని ఎదుర్కొన్న జనసేన సిబ్బంది కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

అసలు అంత రాత్రి వేళలో పోలీసులు జనసేన సిబ్బంది గదులని తనిఖీ చేయాల్సిన అవసరం ఏంటి అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే మంగళగిరి జనసేన ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ ఇంచార్జి పోతిన వెంకట మహేష్ అక్కడికి చేరుకున్నారు.

పోలీసులు బెదిరించిన విధానాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన తీసుకున్న వెంటనే జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భగ్గుమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హేయమైన చర్య అని దుమ్మెత్తి పోశారు. వైసిపి ప్రభత్వం లో పోలీసులు పావులుగా మారారు అని మనోహర్ ఆరోపించారు. ఎలాంటి సమాచారం తో పోలీసులు అక్కడికి వచ్చారు ? అసలు సిబ్బంది గదులు తనిఖీ చేయాల్సిన అవసరం ఏంటి ? ఏయే గదుల్లో ఎవరు ఉన్నారని ఎందుకు ఆరా తీశారు అని మనోహర్ ప్రశ్నించారు.

దీనిని బట్టి స్పష్టంగా అర్థం అవుతోంది.. ఒక వైపు జనసేన పార్టీకి 24 సీట్లే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. జనసేన వల్లే వైసీపీ రాబోవు ఎన్నికల్లో ఓటమి పాలు కాబోతోందని స్పష్టంగా అర్థం అయింది. అందుకే ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. జనసేన కి 24 సీట్లు చాలా తక్కువ.. ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదు అని వైసిపి పైకి చెబుతోంది. కానీ జనసేననే ఇలా పోలీసులని అడ్డుపెట్టి బెదిరిస్తోంది.

TDP-JSP alliance : వైసీపీ 151 టూ 20.. జనసేన 1 టూ 24.. ఇక అంతా జనసైనికుల చేతుల్లోనే, పవన్ మాస్టర్ ప్లాన్ ఇదే

ఈ సంఘటనని బట్టి రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అయ్యే విషయం ఏంటంటే.. జనసేన పార్టీ వల్ల వైసీపీ ఓటమి డిసైడ్ అయిపోయింది అని అంటున్నారు. జనసేన బలం ఊహించని విధంగా పుంజుకుంది అని అంటున్నారు. ఈ సంఘటనపై నాదెండ్ల మనోహర్ విపక్షాలన్నీ కలసి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు.


Spread the love
Tags: AP Elections 2024chillapalli srinivasCM JaganJanasena PartyJanasena Party officeNadendla ManoharPawan KalyanPolice attack On Janasena partyPothina Venkata MaheshYS JaganYsrcp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.