• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

Janasena Pithapuram : పిఠాపురంలో మహా వృక్షంలా ఎదిగిన జనసేన..సేనానికి లక్ష మెజారిటీ, సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ రిపోర్ట్

Satya by Satya
March 19, 2024
in Janasena News, Latest News, Political News
0 0
0
Janasena Pithapuram : పిఠాపురంలో మహా వృక్షంలా ఎదిగిన జనసేన..సేనానికి లక్ష మెజారిటీ, సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ రిపోర్ట్
Spread the love

Janasena Pithapuram : పిఠాపురంలో మహా వృక్షంలా ఎదిగిన జనసేన..సేనానికి లక్ష మెజారిటీ, సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ రిపోర్ట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే జనసైనికుల్లో వచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. కేవలాం పిఠాపురంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ మొత్తం పవన్ నిర్ణయం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. పిఠాపురం ఆధ్యాత్మిక పట్టణం. పిఠాపురం పట్ల జనసేనానికి ప్రత్యేకమైన మక్కువ ఉంది. అక్కడే పుట్టిన శ్రీపాద శ్రీవల్లభుడిని సేనాని తన గురువుగా భావిస్తున్నారు.

2019లోనే పవన్ పిఠాపురంలో పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సారి పవన్ భీమవరం నుంచి పోటీ చేసినా గెలుపు పక్కా. ఆ దిశగా కొన్ని సర్వేలు వెలువడ్డాయట. కానీ పిఠాపురంలో జనసేనాని అడుగుపెడితే వార్ వన్ సైడ్ అని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

పిఠాపురంలో జనసేనాని ప్రచారానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ.. బంపర్ మెజారిటీతో గెలుస్తారని అక్కడి ప్రజలు అభిమానం చాటుకున్నారు. కానీ అక్కడ ఉన్న జనసేన ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. జనసేనకి ఉన్న బలాన్ని వాడుకుంటూ పార్టీని మహావృక్షంలా మార్చేశారు.

ఉవ్వెత్తున ఎగసిపడే మెగా అభిమానం 

పిఠాపురంలో ప్రజలకు మెగా ఫ్యామిలీ పట్ల అంతులేని అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు మాత్రమే కాదు.. వాళ్ళు చేసే నిస్వార్థమైన సేవని పిఠాపురం ప్రజలు గుర్తించారు. ఇక్కడ ఏ గ్రామానికి వెళ్ళిననా మెగా అభిమానులే కనిపిస్తారు. ఇతర హీరోల అభిమానుల్లో కూడా జనసేన పట్ల సానుకూలత ఉంది.

సీఎం స్థాయి వ్యక్తి మా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తమకి గర్వకారణం అని.. లక్ష మెజారిటీతో పవన్ ని గెలిపించుకుంటాం అని అన్ని ఏరియాల నుంచి యునానిమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల నుంచి పవన్ కళ్యాణ్ కి వస్తున్న స్పందన చూస్తే జనసేన రూట్స్ పిఠాపురంలో ఎంతలా పాతుకుపోయాయో అర్థం అవుతోంది.

పిఠాపురంలో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి లాంటి మండలాలు ఉన్నాయి. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ దాదాపుగా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఎక్కడకి వెళ్లినా జనసేనకు అంతులేని అభిమానం వ్యక్తం అవుతోంది. అందుకే ఇక్కడ జనసేనాని లక్ష మెజారిటీ సాధ్యం అని అంటున్నారు.

గత చరిత్ర 

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పిఠాపురం నుంచి వంగా గీతా స్వల్ప మెజారితో విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ఇండిపెండెట్ అభ్యర్థిగా వర్మ భారీ మెజారిటీ సాధించారు. అయితే వర్మ మెగా ఫ్యామిలీ కార్డు వాడడం.. ఇంటింటికీ తిరిగి సానుభూతి క్రియేట్ చేయడం వల్ల అంత మెజారిటీ సాధ్యం అయింది. ప్రస్తుతం వైసిపి అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు.

వంగా గీత ప్రభావం నామమాత్రమే 

ఈ సారి దొరబాబుకి పిఠాపురం టికెట్ లభించలేదు. కాకినాడ ఎంపీ వంగా గీతకి ఇక్కడ టికెట్ లభించింది. పవన్ పై పోటీ చేసేది ఆమెనే. ప్రజారాజ్యంలో పీఆర్పీ నుంచి గెలిచిన సెంటిమెంట్ వర్క్ అవుతుందేమో అని చిన్న ఆశతో జగన్ ఈ ఎత్తుగడ వేశారు. అయితే ప్రస్తుతం వంగ గీత ప్రభావం నామమాత్రమే అని అంటున్నారు. కాపుల ఓట్లు చీల్చడానికి పన్నిన పన్నాగం అని పిఠాపురం ప్రజలకు అర్థం అయిపోయింది.

ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా డబ్బు తీసుకుని గాజు గ్లాసుకే ఓటు గుద్దేస్తాము అంటూ పిఠాపురం ప్రజలు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇక ఇటీవల ముద్రగడ వైసిపిలో చేరడంతో ఆ పార్టీపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. వంగా గీతకి పడే కొద్దిపాటి ఓట్లు కూడా సాధ్యం కాదు అని అంటున్నారు.

Mudragada Padmanabham : వరస్ట్ లాజిక్ తో తన నిజస్వరూపం తానే బయటపెట్టుకున్న ముద్రగడ.. కాస్త సింపతీ కూడా పాయె..

ప్రజారాజ్యం సమయంలో ఎన్నికల ముందు పిఠాపురంలో చిరంజీవి సర్వే చేయించారట. వంగా గీతపై తీవ్ర వ్యతిరేకత ఉందని..కానీ చిరంజీవి కోసమే ఇక్కడ పీఆర్పీకి ఓటు వేస్తామని సర్వేలో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కి తగ్గట్లుగానే ఆమె స్వల్ప మెజారిటీతో బయట పడ్డారు. ఇక గత ఎన్నికల్లో ఆమె కాకినాడ ఎంపీగా ఆమె జగన్ వేవ్ లో గెలిచారు. అది కూడా 25 వేల స్వల్ప మెజారిటీతో.

మెజారిటీ ఎంత.. లక్ష అనే నినాదం 

ఓవరాల్ గా చూస్తే పిఠాపురంలో జనసేనాని లక్ష మెజారిటీ సాధించడంపై చాలా సానుకూలతలు కనిపిస్తున్నాయి. పిఠాపురం బరిలో నిలుస్తున్నాను అని పవన్ ప్రకటించినప్పటి నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. ప్రజల్లోకి ‘మెజారిటీ ఎంత.. లక్ష’ అనే నినాదంతో వెళుతున్నారు.


Spread the love
Tags: AP Elections 2024BjpBolisetty SrinivasChandrababu NaiduJanasena NRI MeetingJanasena PartyJanasena PithapuramNarendra ModiNDAPawan KalyanPawan Kalyan From PithapuramPithapuram Assembly constituencyPithapuram PublicTdp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.