Mudragada Padmanabham : వరస్ట్ లాజిక్ తో తన నిజస్వరూపం తానే బయటపెట్టుకున్న ముద్రగడ.. కాస్త సింపతీ కూడా పాయె..
కాపు నేతగా కావలసినంత పబ్లిసిటి కొట్టేసిన ముద్రగడ పద్మనాభం.. ఆ సింపథీతోనే ఇంతకాలం నెట్టుకొచ్చారు. ఎట్టకేలకు ఆయన రంగులన్నీ బయటపడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్ ని వెతుక్కుంటూ వెళ్లి ముద్రగడ పద్మనాభం వైసిపి కండువా కప్పేసుకున్నారు. దీనితో ఆయన ముసుగు పూర్తిగా వీడిపోయినట్లు అయింది.
కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి మాత్రమే కాపు నాయకులని ఉపయోగించే జగన్ కాళ్ళ దగ్గర ముద్రగడ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసుకున్నారు అంటూ బలమైన విమర్శలు మొదలయ్యాయి. వైసిపిలో చేరగానే ముద్రగడ జగన్ అప్పగించిన పని మొదలు పెట్టేశారు. ముద్రగడకి జగన్ అప్పగించింది కొత్త పనేమీ కాదు.
వైసిపిలో ఉన్న అందరు కాపు నాయకుల్లాగే ఈయన కూడా పవన్ ని తిట్టడమే జగన్ ముద్రగడకి అప్పగించిన పని. రీసెంట్ గా ముద్రగడ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కొన్ని లాజిక్కులు బయటకి తీసుకువచ్చారు. ఆ వరస్ట్ లాజిక్కులతో ముద్రగడ తన నిజస్వరూపాన్ని తానే బయట పెట్టుకున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముద్రరగడని కాపు ప్రజలు, ఆ నాయకులు నమ్మే పరిస్థితి ఎపుడో పోయింది. ఇప్పుడు కాపు నేత అనే సెంటిమెంట్ ని కూడా ముద్రగడ తనకి తానె తొలగించేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. నేను రాజకీయాల్లో హీరో. నేను ఆయన దగ్గరకి వెళ్ళండి. ఆయన వచ్చి అడిగితే ఏమైనా చేస్తాను. ఆయన సినిమాల్లో హీరో అయినంత మాత్రాన నేను వెళ్లాలా అంటూ ఏవేవో లాజిక్కులు మాట్లాడారు.
కాపుల సంక్షేమం కోసం ఎలాంటి పాలసీ తీసుకురాని.. రాష్ట్రాన్ని అధోగతి వైపు తీసుకెళుతున్న జగన్ వద్దకు మాత్రం వెళతారా అంటూ ముద్రగడకి కౌంటర్లు పడుతున్నాయి. జగన్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవడానికి అయితే సిద్ధం కానీ.. నిజాయతీ పరుడు, సాటి సామజిక వర్గానికి చెందిన వ్యక్తి.. ఒంటరి పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని కలవడానికి మాత్రం ఇగోలు అడ్డు వస్తాయి కదా అంటూ జనసైనికులు విరిచుకుపడుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరడమే మంచిది అయింది అని భావించే కాపు నేతలు, ప్రజలు కూడా ఉన్నారు. దీని ద్వారా ఆయన ఏంటో సామాన్య ప్రజలందరికి అర్థం అయింది అని దుమ్మెత్తి పోస్తున్నారు.