Kushita Kallapu : ఇండస్ట్రీలో ఇలాంటి అవమానాలు తప్పవు..గుంటూరు కారంలో నా సీన్లన్నీ తీసేశారు, యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఫ్యాన్స్ కి నిరాశనే మిగిల్చింది. ఆడియన్స్ తో పాటు క్రిటిక్స్ కూడా ఈ చిత్రంపై పెదవి విరిచారు. అయితే ఇటీవల ఓటిటిలోకి విడుదలైన ఈ చిత్రం సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. మహేష్, బాబు శ్రీలీల ఈ చిత్రంలో జంటగా నటించారు. కానీ మీనాక్షి చౌదరి పాత్ర ప్రాధాన్యత ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇలా ఈ చిత్రంపై చాలానే విమర్శలు వచ్చాయి.
సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా ఇది మహేష్ బాబు స్థాయి చిత్రం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో నటి గుంటూరు కారం చిత్రం విషయంలో బాగా అప్సెట్ అయింది.ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛాంగురే బంగారు రాజా చిత్రంలో నటించిన కుషిత కళ్లపు గుంటూరు కారం చిత్రంలో కూడా నటించింది.
Kushita Kallapu About Guntur Karam Movie Shoot
కానీ ఫైనల్ అవుట్ పుట్ లో ఆమె సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు. దీనితో చాలా బాధపడింది. ఇలాంటి అవమానాలు ఇండస్ట్రీలో సహజమే అని బాధపడింది కుషిత. నాలుగురోజుల పాటు గుంటూరు కారం చిత్ర షూటింగ్ లో కుషిత పాల్గొందట. సెట్స్ లో నుంచి తన ఫొటోస్ ని కూడా అభిమానులతో షేర్ చేసి మురిసిపోయింది. కానీ చివరికి ఆమె సన్నివేశాలని ఎడిటింగ్ లో లేపేశారు.
చిత్ర యూనిట్ ని తన సన్నివేశాలు ఎందుకు తొలగించారు అని అడిగిందట. కానీ తనతో పాటు మరికొంత మంది నటుల సీన్స్ కూడా ఎడిటింగ్ లో తీసేసినట్లు కుషిత పేర్కొంది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Actress Kushitha Kallapu Photo Gallery
Discussion about this post