Mallikharjuna Kharge : “ఇండియా” కూటమి ప్రధాని అభ్యర్థి గా ఖర్గే..?
త్వరలోనే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. ప్రతిపక్ష కూటమి “ఇండియా” నేతలు నిన్న ఢిల్లీలో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడం కోసం వ్యూహాలు.. ఉమ్మడి ప్రచారం.. సీట్ల సర్దుబాటు వ్యవహారాలపై నిన్నటి సమావేశం లో చర్చించారు.
28 పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయిన ఈ మీటింగ్ లో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరత్ పవర్, శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు పలు అంశాలపై చర్చించారు.. ఇండియా కూటమి తరపున మల్లికార్జున ఖర్గే ని ప్రధాని అభ్యర్థిగా ఉండాలంటూ మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ తో సహా పలువురు నేతలు ప్రతిపాదించగా.. ఖర్గే సున్నితంగా తిరస్కరించారు. ముందుగా ఎన్నికల్లో విజయం సాధించాలని.. ఆ విషయం పైనే దృష్టి పెట్టాలి అంటూ ఆయన సమాధానం ఇచ్చారు.
గత రెండు ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ సారధ్యంలో ఎన్నికలకు వెళ్లి.. తర్వాత భారత్ జోడో యాత్ర అంటూ హడావుడి చేసి.. తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉన్నట్టుండి ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు తెరమీదకి రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Discussion about this post