My First Vote for Janasena Slogan : శనివారం సాయంత్రం తెనాలి నియోజకవర్గం, సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యులు, నాయకులతో అభివృద్ధి అందరికి సంక్షేమం వివాదంతో ప్రజల వద్దకు వెళ్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో కాదని, రాష్ట్ర కోసం అనే
వాస్తవాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరాడు. రెండు నెలలపాటు కష్టపడితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కార్యవరణ, సన్నద్ధత పై చర్చించాడు. ప్రజల కోసం విరిసిన పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, పవన్ గారి విధానాలు ప్రతి ఒక్కరికీ వివరించాలి, ఒక్కొక్కరు కనీసం పది మందిని ప్రభావితం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి.
అధికార ప్రభుత్వం కనబడిన చోటల్లా రంగులు పూయడం మినహా చేసిన అభివృద్ధి లేదు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల వద్ద ఎండగట్టాలి. ఇన్సూరెన్స్ కట్టకుండా రైతుల్నీ నష్టపరిచారు. మహిళలను ఇబ్బందిపెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు తెలియచేయాలి. ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కలసి ముందుకు వెళ్లం అన్ని వర్గాల ప్రజలను కలసి వారి సమస్యలు తెలుసుకుని వారికి భరోసా ఇద్దాం.
పండుగ వరకు గ్రామ స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, పండగ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నద్ధితకు సిద్ధం అవుదాం కొత్తగా నమోదైన ఓట్ల మీద దృష్టి సాదించండి. “మై ఫస్ట్ ఓట్ ఫర్” జనసేన కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లండి అని నాదెండ్ల మనోహర్ సూచించారు.