Nagababu : ఒకవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో జనసేన భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయడంలో బిజీ,బిజీగా ఉంటూన్నారు. అందులో భాగంగానే మరోవైపు నాగబాబు యూరప్ పర్యటన జనసేనలో కొత్త ఊపు తెచ్చింది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీని ముందంజలో ఉంచి, ప్రజలకు దగ్గరగా ఉండడానికి రాత్రనక, పగలనక శ్రమిస్తూ సాయ శక్తుల ప్రజల సమస్యలను వింటూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పుడు అందులో భాగంగానే నాగబాబు కూడా యూరప్ పర్యటన మొదలుపెట్టారు.. యూరప్ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు లండన్ చేరుకున్నారు. ఎన్.ఆర్.ఐ. జనసేన యూరప్ విభాగం ఆధ్వర్యంలో ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ముఖ్య జనసైనికులు, వీర మహిళలతో నాగబాబు సమావేశమయ్యారు.
శనివారం సౌత్ హారో లో యూకే కు చెందిన జనసైనికులు, వీరమహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు నాగబాబు పాల్గొంటారు. 10 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో యూకేతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాల్లోని ఎన్.ఆర్.ఐ. జనసైనికులతో నాగబాబు గారు మమేకమవుతారు. పార్టీ బలోపేతం, ప్రవాస భారతీయులను పార్టీకి మరింత అనుసంధానం చేసే దిశగా నాగబాబు గారి పర్యటన సాగనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.