Nagababu : రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయ వనరులను, యువతకు ఉద్యోగాలను అందించే అక్షయ పాత్ర పోలవరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ పూర్తిచేయకుండా, గాలికొదిలేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది వైసిపి ప్రభుత్వం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. భారతదేశం స్వాతంత్రం కంటే ముందే పోలవరం ప్రాజెక్టు గురించి చర్చలు జరిగాయి.
చాలా కాలం గడిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య గారి టైంలో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో,మళ్లీ చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని పనులు జరిగాయి. ఇప్పుడు వైయస్ జగన్ హయాంలో పోలవరం పనులు మూలనపడ్డాయి. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందనే నమ్మకం లేదు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మొదటి సంవత్సరం మూడు పంటలు పండుతాయి. దానివల్ల వచ్చే ఆదాయం 40,000 కోట్లు పైచిలుకె, రెండవ సంవత్సరం 50 వేల కోట్లు, మూడవ సంవత్సరం 60 నుంచి 70 వేల కోట్లు ఏడు సంవత్సరాలు పూర్తయ్యేసరికి లక్ష కోట్లకు తగ్గకుండా మన రాష్ట్రానికి ఆ ప్రాజెక్టు ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని నాగబాబు అన్నారు.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఫుడ్ గ్రేన్స్ ని మనం సప్లై చేయగలుగుతాము. ఎలక్ట్రిసిటీ, హైడల్ ప్రాజెక్టు వీటన్నింటిని మనం ఉపయోగించుకుంటూనే మనకు సరిపోయిన తర్వాత మిగిలిన దాన్ని పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసి దాని ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు అని నాగబాబు ప్రాజెక్టు ద్వారా కలిగే ఉపయోగాలను వివరించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానివల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ వైసీపీ అసమర్ధ పాలన వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందన్న ఆశ లేదు.
కానీ జనసేన అధికారంలోకి వస్తే ముందుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతామని, రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నామని నాగబాబు అన్నారు.